పుట:Gurujadalu.pdf/603

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క్షితి మేచ్ఛభాష శృతి గ
రితమగునట్లే నని ధరిత్రిని దానిన్।
మతీరోసి విడువగూడదు
సతతము వ్యవహారహాని సంధీలు కతనన్॥

పై పద్యమున మ్లేచ్ఛభాషయని రాయడములో అప్పకవి తురకల భాషను మనస్సులో వుంచుకున్నాడు. ఆ కింది ఉదాహరణములను చూడండి. సుబ్బారావు పంతులుగారు యింగ్లీషు భాషను మనస్సులో వుంచు కొనిరి. గాని శృతి గరితమయిన మెచ్చితము, యిది గాని, అది గానీ కాదనుకుంటాను.

పతంజలి, వ్యాకరణాధ్యయన ప్రయోజనములను చెప్పడములో, శతపథ బ్రాహ్మణంలోని ముక్కొకటి యెత్తి రాసినారు.

తె సురా, హేలయో, హేలయ ఇతి కుర్వన్తః పరాబభూవు:
తస్మాద్రాహ్మణే న మ్లేచ్ఛితవై నాపభాషితవై
మేచ్ఛోహవా ఏషయ దపశబ్దః|

మరివొకచోట మహాభాష్యంలో - గరీయా నపశబ్రోపదేశః! ఏకైకస్య శబ్దస్య బహవో అప భ్రంశాః| తద్యథా గౌరిత్య శబ్దస్య గావీ | గోణీ, గోతా, గోపోతలికేత్యేవ మాదయోపభ్రంశాః”

శృతిదృష్ట్యా, సంస్కృతపు మాట, లోకులనోట మారి సంస్కృత లక్షణమునకు పొందక పోగా, అట్టిమాట మ్లేచ్ఛితము లేక అపశబ్దమగును. అంతేగాని తురకమూ, యింగిలీషూ మెచ్ఛితములు కావనుకుంటాను.

ఉద్యోతంలో నాగోజీ భట్టు "నమేచ్చితమై ఇత్యేత న్మేచ్చభాషా విషయ మితి భ్రమనివృత్త్యర్థం తద్వివరణం నాపభాషితవై ఇతి అపశబ్దత్వం వ్యాకరణానుగత శబ్ద స్యేషద్భంశన ఏవ ప్రసిద్ధ మితి భావః| నను మేచ్ఛనామ పురుష విశేషో దేశ విశేషోవాస కథ పమశబ్లో|| త అహ ఘజితీ! నిన్గావచనా న్మేచ్చతే రితి భావః| నిన్గా చ శాస్త్ర బోధిత విపరీతోచ్చారణేన పాపసాధనత్వాత్ ఏవం చ బ్లోచ్ఛా ఇత్యస్య నిన్యా ఇత్యర్థ ఇతి దిక్”

వేదదృష్ట్యా, అన్య దేశభాషలకు మ్లేచ్చిత దోషము వర్తించనేరదు. "గ్రామ్యము నందు గల యనేక దోషంబుల గ్రహించియే పూర్వులు “అపశబ్దం ప్రయుంజానో రౌరవం నరకం వ్రజేత్” అని శాసించి” రని సుబ్బారావుగారు ఒక బాంబును నా బోట్ల మీద విసరజూడగా అది, పంతులు గారి చేతిలోనే పేలినది. యుక్తమే కదా?

సుబ్బారావు పంతులుగారు రామాయణము తెనిగించినారు. వారి తెనుగు సంస్కృత పదములతో నిండివున్నది. వీరి సంస్కృత ప్రయోగములలో మ్లేచ్చితములు అక్కడక్కడ కలవు.


గురుజాడలు

558

గ్రామ్యశబ్ద విచారణము