పుట:Gurujadalu.pdf/600

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మాట, మంతీ - 1

గ్రామ్య శబ్ద విచారణము

నవంబరు 5వ తేది శశిలేఖలో మ. చినపురుషోత్తం పంతులుగారు మొదలైనవారున్ను, 7వ తేదీని మా మిత్రులగు మ. లక్ష్మణరావు పంతులుగారున్ను వ్రాసిన లేఖలు చూస్తిని.

శశిలేఖా సంపాదకులు నాకు చాలా కాలము నాటి మిత్రులు. చెడుగు చేతామనే వూహతో నన్నుగూర్చి యేమిన్ని వ్రాయరు, అచ్చొత్తరు. కాక, యేమి ప్రచురించినా, మా స్నేహానకు భంగము రాబోదు.

విద్వాంసుల ధోరణులు వేరు వేరు రీతుల నుంటవి. హాస్యరసము మీద కొందరి కలము పరుగులిడుతుంది. కొందరి బుద్దులు దోషాన్వేషణములో వాడితేరుతవి. మరికొందరి బుద్దులు తిట్లకు తీరివుంటవి. ఈ మూడు రీతులూ చాలినంత లేకపోవడము వల్లనే, మన భాష యిప్పటి యీ దురవస్థలో వున్నదని నా అభిప్రాయము.

కాని, కన్ను కొంచెము తెరచి, యితర దేశములలో భాషలు యేలా పెరుగుతున్నవో, అదిన్నీ, గత కాలములో మన దేశభాషలు యెట్లు పెరిగినవో అదిన్నీ, కానీ; శ్రద్దతో భాషా శాస్త్రమును కరచి, గ్రాంథిక వ్యావహారిక భాషలను పరిశీలించి, మరి తప్పులు పట్టతలవడితే, ఉభయ తారకంగా వుండును. తీర్పులు చెప్పడం సులభం; విద్యా పరిశ్రమ కష్టం.

అంతవరకు యెవరి స్వభావానుసారముగా వారిని వ్రాయనిస్తేనే తప్ప, పేపర్లకు యీపాటి వ్రాయడమూ వుండదు. అచ్చు ఆఫీసులు మూసి, పత్రికా సంపాదకులు తపస్సుకు కూచోవలసి వస్తుంది.

ఇక మా మిత్రులు మ. లక్ష్మణరావుగారి మాట-మ.రాయప్రోలు సుబ్బారావు పంతులుగారు యేమివ్రాశారో నేను చూచియుండలేదు. లక్ష్మణరావు గారి వ్రాతను పట్టి చూడగా వారికి, వాడుక భాషయందు నిరసన భావం వున్నట్టు కనబడుతుంది ఏలనో? వారు దయచేసి కారణము చెప్పుదురు గాక.

గత కాలములో నవమాష్టం పారాయణము చెయ్యడమందు నిపుణులైన బ్రాహ్మణ వుద్యోగస్థులు రయితును, రట్రను, పరిపాటిగా, ఒక స్వారస్యమైన తిట్టు తిట్టుతూ వచ్చేవారు.


గురుజాడలు

555

గ్రామశబ్ద విచారణము