పుట:Gurujadalu.pdf/586

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



చెప్పుతాడు. హటయోగం అభ్యసిస్తాడు. రోడ్డు పక్క యేటి వొడ్డు తోటలో మఠం యితనిదే. యితనికి శిష్య బలగం లావు.

“సాయీబూ! నువ్వు గుండం తొక్కగలవా?” అని నాంచారమ్మ అడిగారు.

“మీ శలవైతే అవలీలగా తొక్కుతాను తల్లీ” అని అన్నాడు.

నాంచారమ్మ : “యేడీ మనవాళ్ళయ్య? గరుడుడి అవతారం అంతర్ధానమైపోయిందీ. | రామినాయడా పరమ భాగవతోత్తములైయుండిన్ని, మీరు యెవరూ గుండం తొక్కజాలినారు కారు గదా? అట్టి స్థితిలో యీ పచ్చి తురకకి గుండం తొక్కడానికి భగవంతుడు సాహస ధైర్యాలు యిచ్చాడు. గనక మీ వైష్ణవ మతం గొప్పా అతగాడి తురక మతం గొప్పా? రామినాయడా మీ దేవులాటంతా యీ రాత్రి వైష్ణవులు శైవులికి, పరాభవం చెయ్యాలని గదా! అందుకు వుపాయం చెబుతాను వినండి. మతాలు, సాత్వికాలూ తామసాలూ అని రెండు విధాలు. ఈ రెండు విధాల మనుష్యులూ శైవుల్లోనూ, వైష్ణవుల్లోనూ కూడా వున్నారు. గుండాలు దొక్కడం మొదలైన తామస కృత్యాలు చేసే వాళ్ళని శైవుల్లో శివాచార్లు అంటారు. మన వైష్ణవుల్లో అట్టి కృత్యాలు చేసే తెగ కూడా వున్నారు - యెవరో మీకు తెలుసునా?

మనవాళ్ళయ్య గుంపులో మరి వక పక్కనుంచి తన బుఱ్ఱ పైకి పెట్టి “యెవళ్ళమ్మా వాళ్ళు” అని అత్యాతురతతో అడిగాడు.

మునసబు నాయడు “మరెవళ్ళు? సాతానోళ్ళు" అనేటప్పటికి, మనవాళ్ళయ్య బుఱ్ఱ మళ్ళీ మందలో మాయమైపోయింది.

నాంచారమ్మ: “ఆ వైష్ణవులు యెవరా? మరెవరు తురకలు; పీరు అనేది యేమిటనుకున్నారు. శ్రీ స్వామివారి తిరునామమే. పట్టణంలో మా యింటి పక్కనే ఒక సాతాని పీర్లని నిలిపి గుండం తొక్కేవాడు. పట్టణంలో యెంతో మంది హిందువులే పీర్ల పంజాలు వుంచి గుండాలు తొక్కుతారు. గనక శ్రీ రామస్వామి వారి నామం తెచ్చి పీరు కట్టి యిస్తాను. ఆ పీరు పట్టుకు పీరు సాయీబు గుండం తొక్కుతాడు. పీరు సాయీబు యోగ్యత మీరెరిగినదే. అతగాడు కబీరు దాసంత భక్తుడు. గనక భయాలు విడిచి అతని వెంట వెళ్ళి జయించుకురండి. వేళకి భక్తి నిలుస్తుందో, నిలవదో చేతి కఱ్ఱలు మాత్రం మరవకండి.

ఆమె విరమించే సరికి పెళపేళమని ఆ మూకలో నుండి మనవాళ్లయ్య శ్లోక పఠనం ఉపక్రమించి యిటూ అటూ మనుషులను తోసుకుంటూ యెదటికి వచ్చి సాష్టాంగ వేసి “అమ్మా మీరు సాక్షాత్తూ శ్రీ మహాలక్ష్మి అవతారం. వైష్ణవ మతం నిలబెట్టారు. మతమే అన్నమాట యేమిటి? మా ప్రాణాలు కూడా నిలబెట్టారు. యిహ నా విజృంభణం చూడండి” అన్నాడు. మన వాళ్ళయ్య పెద్ద హికమద్దారుడు. ఆ రాత్రి వైష్ణవ తంత్రం తరవాయి కథ అంతా అతనే నడిపించాడు.

గురుజాడలు

541

మీ పేరిమిటి?