మున : “నాకు మంతరం, మాయా యెరికనేదే! అందకనే సాతానోణ్ణి తొక్కమన్నాను”.
నాంచా : (మనవాళ్ళయ్యతో) “నువ్వెందుకు తొక్క కూడదూ?”
మనవాళ్లయ్య : “అమ్మా యీవేళ యేదో నా ప్రారబ్దం చాలక యీ మీటింగు తలపెట్టాను. బుద్ది గడ్డి తిన్నది. యిదుగో లెంపలు పడపడ వాయించుకుంటున్నాను. తల్లీ నన్ను యీకాడికి వొదిలివేస్తే శ్రీరంగం వెళ్ళిపోతాను. యీ నాలుగు వూళ్ళ పొలిమేరనూ, నేనంటూ తిరిగీ కనపడితే, నా నెత్తి మీద పెద్ద పిడుగు పడిపోవాలి”.
నాంచా : “నీకు కొండంత గుండె వుంది! (రామి నాయడుతో) మునసబు నాయడా, నీ వియ్యంకుడు సారధి నాయుడు విరిగిపోతే, ద్వాదశి ద్వాదశికీ “శక్కర పొంగళం”, “పుళియోరీ” లేకపోతాయని గదా నీ దుఃఖం.
మునసబు : (తలగోక్కుంటూ) “ నాకొక్కడికే అన్న మాటేటమ్మా ఆ రామస్సోంవారికి మాత్రం పుళియోరం కరువైపోదా?”
మనవా :"అమ్మా శర్కరపొంగలి, దధ్యోదనమూ అనేవి ముఖ్యములు కావు. వైష్ణవ మతోత్కర్ష మహిమ కనపర్చి ఉద్దరించాలి, అదీ కర్తవ్యం”.
నాంచాం : ఆ వుద్దరించడం యేదో నువ్వేల చెయ్యరాదు? నీకు ఉత్సవవిగ్రహమంటూ యేలా? ఆకాశమంత రాగిధ్వజం మోసుకు తిరుగుతావు గదా. దానిలో అరకాసంతయినా మహత్తు లేదా?"
మనవాళ్ళయ్య, “మళ్ళీ మొదటి కొచ్చింద"ని సణుక్కుంటూ, కష్టం మీద మందలో దూరి అంతర్ధానం అయిపోయినాడు.
నాంచా : “రాముడే కాడు. యే దేవుడి మీద నయినా నిజమైన నమ్మకమన్నది యేడిస్తే, ఒక్క గుండవేఁ కాదు, అన్ని కష్టాలూ తరించవచ్చును. నేను మా మామగారి పేరు స్మరిస్తూ గుండం దొక్కుతాను. నా వెంట రాగలిగిన వైష్ణవులెవరైనా వుంటే యెదటికి రండి”.
యెవడూ కదలలేదు.
నాంచారమ్మ: నిరసన నవ్వు నవ్వి “ముసలాయనను అగ్గిలో తోసి పైనుంచి చూడడానికి మీరంతా వీరులా?”
యెవరూ ఉలకలేదు పలకలేదు.
నాంచారమ్మ అందరినీ కలయజూసి "పీరు సాయీబు యిక్కడ లేడా?” అని అడిగింది. పీరు సాయీబు వెంటనే యెదటికి వచ్చి "అమ్మా యిదిగో దాసుడ”ని చెయి జోడించి నిలుచున్నాడు. పీరు సాయీబు దూదేకుల సాయీబు అయినప్పటికీ, రామభక్తుడు, కీర్తనలు
గురుజాడలు
540
మీ పేరిమిటి?