పుట:Gurujadalu.pdf/577

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



గత కాలము నాటి స్థితిగతులను గూర్చిన ఊహాలతో నిండి యుండెను. తలపోసి తలపోసి ఆనాడు యీ స్థలం యెలా వుండెనో బౌద్ధులు యేమి యేమి చేసేవారొ అని నేనంటిని.

ఆ పీనుగులు మనలాగే యేడుస్తూ వుండేవారు. మనకంటే అర్ధాన్నంగా వుండేవారు : అని సున్నితమైన తలంపులు బెదిరి చెదిరే పెళుసు గొంతుకతో వెంకయ్య అరిచాడు. నాకు కళ్ళ మొయ్యా కోపం వచ్చి, “నీ అమూల్యమయిన వూహలతో నువ్వు ఆనందించరాదా, నా తలలోనే కల్పించుకున్న బౌద్ద ప్రపంచమును పెటుకు మాటలాడి యేల కలత పరిచెదవు” అని అడిగాను.

“గాని” శాస్తులు గారు అన్నారు. “బుద్దుడు విష్ణ్యవతారం గదా యీ జంగాలు శివుడని యేల పూజ చేస్తూన్నార్రా?” అని శంక వేశారు.

శాయన్న భుక్త పొడుం డబ్బీ తీసి, పెద్ద పట్టు పీల్చి, గావాంచాతో ముక్కు తుడుచుకుని, “ఒక కథ వుంది” అన్నాడు. కథంటే శాస్తులు గారికి సరదా. “అయితే చెప్పు అన్నారు” చెవి వొగ్గి విన్నాం. యిదీ కథ.

ఈ గ్రామంలో శైవ వైష్ణవ మతాలకు వైరం చిరకాలం నుంచి కద్దు. శివ మతానికి మొనగాడు జంగం శరభయ్య అనగా యిప్పుడు పారిపోయిన పూజారే. మొన్న ప్రతిమనుపెరికి పలాయనం అయిందాకా అతగాడు సాక్షాత్తూ నందికేశ్వరుడి అవతారమని రాత్రులు గృహ యెదుట వృషభ రూపమైఁ మేస్తూ వుంటాడని యిక్కడి జంగాలకూ, దేవాంగులకూనమ్మకం. యిపుడైనా ఆ దొర కిందటి జన్మంలో పరమ మహేశ్వరుడౌట చేత ఆ విగ్రహమును కోరినాడనీ, భక్తవాత్సల్యత చేత శివుడిచ్చిన శలవును అనుసరించే శరభయ్య విగ్రహాన్ని పెరుక్కు వేళ్ళాడనీ డేరా నుంచి పారిపోవడంలో వృషభ రూపం ధరించి రంకె వేసి మరీ దాటేశాడనిన్ని ఒక వార్త అప్పుడే అతని శిష్యులు పుట్టించారు. రేపో నేడో వీరాసనం వేసుకుని ఒక ధ్యానం చేస్తూ కొండ మీదనో, గోపురము మీదనో ఆవిర్భవిస్తాడు. బాజా బజంత్రీలతో వెళ్ళి ఉల్లభం బట్టి తోడ్చుకు వస్తారు. ఆ పైని కంసాలి వీరయ్య (వీరణాచారి అని పిలిస్తేనే గాని కోపగిస్తాడు) ఆ కథకి చిలవలూ పలవలూ కల్పించి ద్విపద కావ్యం రచించి అచ్చు వేస్తాడు. ఆ ఉభయుల కీర్తి దిగ్దంతులకు వెల్లవేస్తుంది.

“ఔరా వీళ్ళ మూఢభక్తి, యీ ప్రపత్తి పండితులకు వుండదురా, వీళ్ళది యేమి అదృష్టం”, అని గురువు గారు అన్నారు. ఆపైని వెంకయ్య యేమో అనబోతే చేతితో నోరు అడ్డాను. యెవరి అభిప్రాయం వారు చెప్పకుండా నీ శాసనం యేమిటి అని అడిగాడు. మాటాడవద్దని చైసౌజ్ఞ చేశాను. శాయన్న భుక్త తిరిగీ యెత్తుబడి చేశారు.

గురుజాడలు

532

మీ పేరిమిటి?