పుట:Gurujadalu.pdf/499

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



బిల్హణీయము: అముద్రిత భాగము

బిల్హణీయము

* రెండవ అంకము

స్థలము

అనిహిల్లా పట్టణమునకు కొంచం దూరంలో సరస్వతీ నదీ తీరమందు కాశ్మీర రాజపుత్రులు వలస వచ్చి విడిచిన పేట, ఒక ఉద్యానవనము మధ్య ఆ కాశ్మీరుల యజమానిన్నీ, కాశ్మీర మహారాజులకు బంధువున్నూ, ఒకప్పుడు కాశ్మీర రాజ్యములో సామంతరాజున్నూ ఐన చంద్రవర్మ అనే రాజు యొక్క తోట మిక్కిలి రమ్యమైనది.

చంద్రవర్మ శూరుడు, విద్వాంసుడు, లోకానుభవము కలవాడు. మహమ్మదు ఘజినీ సోమనాథ క్షేత్రమును కొట్టినప్పుడు ఈయన కుమారుడు ఇంద్రవర్మ యుద్దంలో మృతి పొందెను. ఇంద్రవర్మకు రణసింహుడను పందొమ్మిదియేళ్ళ ప్రాయంగల ఒక కుమారుడును, పదహారేళ్ళ ప్రాయముగల కుమార్తెయును కలరు.

చంద్రవర్మగారి భవనమునకు సామీప్యములో ఆ యుద్యానవనములోనే ఒక కొలను వడ్డున ద్రాక్ష తీగ లల్లిన మంటపములో చిత్రాసనము మీద జమిలి స్థంభములకు చేర్చిన దిండును చారబడి బిల్హణుడు, యెదట మరి వక చిన్న చిత్రాసనము మీద రణసింహుడు కూచుని యుందురు.

బిల్హ : (పత్రము చేతపట్టి చదువును.)

అస్యాశ్చర్యమయస్య మస్త్రగతయః స్వైరం తరంగై రపి,
జ్ఞాయన్తే న విధేరివాతికుటిలా వైదగ్ధ్యసీమా భువః
శ్రూయన్తేప్రతిభూభృతాం వసతయ స్త్వంగత్తురంగావళి
విశ్వోత్జేల ఖురాగ్రఖణ్డితముణి క్షోణీతలాః కేవలమ్!

రణసింహుడు : ఆహా! యేమి శ్లోకం!

బిల్హ : కుమార, ఇది వినండి.

వాత్సల్యం నవహత్యపత్యవిషయే వ్యాక్షిప్యతే న క్షణం
దాక్షిణ్యేన సమీహతే నవవధూ వర్గేపి ధీరాశయః
నిష్ణాతః కుటిలే నయాధ్వని చరన్నాచారపూతః ప్రభో
దుస్సాధ్యా నపి సాధయత్యభిమతా నర్ధా సుసాధ్యానపి

గురుజాడలు

454

బిల్హణీయము