పుట:Gurujadalu.pdf/329

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మధు : మీకు మతిలేకపోవడవేఁం, నాకే. రామ : యెం చేత? మధు : నుదట్ను వ్రాయడం చేత. రామ : యేవఁని రాశుంది? మధు : విచారం వ్రాసివుంది. రామ : యెందుకు విచారం? మధు : గిరీశం గారు లుబ్ధావధాన్లు గారి తమ్ములైతే, పెళ్లికివొస్తారు; పెళ్లికి వస్తే యేదైనా చిలిపి జట్టీ పెట్టి, మీమీద చెయి జేసుకుంటారేమో అని విచారం. రామ : అవును, బాగా జ్ఞాపకం చేశావు, గానీ డబ్బు ఖర్బైపోతుందని అవుఁధాన్లు బంధువుల నెవళ్లనీ పిలవడు. మధు : గిరీశం గారు పిలవకపోయినా వస్తారు. రామ : నువుగానీ రమ్మన్నావా యేమిటి? మధు : మీకంటే నీతి లేదు గాని నాకు లేదా? రామ

మరి వాడొస్తాడని నీకెలా తెలిసింది?

మధు : పెళ్లికూతురు అన్నకి చదువు చెప్పడానికి కుదురుకుని, వాళ్లింట పెళ్లి సప్లై అంతా ఆయనే చేస్తున్నారట. అంచేత రాకతీరరని తలస్తాను. రామ : వాడొస్తే యేమి సాధనం? మధు : నన్నా అడుగుతారు? రామ : పెళ్లే తప్పిపోతే? మధు : యలా తప్పుతుంది? రామ : తప్పిపోడానికి ఒక తంత్రం పన్నాను. మధు : అయితే, మధురం మాట చెల్లించారే? రామ : చెల్లించక రావఁప్ప యే చెరువు నీళ్లు తాగుతాడు? మధు : యేదీ ముద్దు (ముద్దు పెట్టుకొనును. ) రామ : గాని మధురం, కీడించి మేలిద్దాం. ఒకవేళ దెబ్బ బేజోటు అయిపోయి వాడు రావడవేఁ తటస్థిస్తే యేవిఁటి సాధనం? కన్యాశుల్కము - మలికూర్పు గురుజాడలు 284