ప్రదర్శించితిమి. వాని నన్నిటిని శ్రీవారు తిలకించి తమపరిపాలనలో చేరిన దేశమున ఈ యుద్యమ మింతశ్లాఘాపాత్రముగ వ్యాప్తి మెందుచుండ వారి కంతవఱకు తెలియకుండుటకు వారచ్చెరువొందిరి. మన యుద్యమమును గూర్చి హిందూపత్రికాధికారులును, దేశ భక్తాగ్రేసరులు నగు శ్రీమా౯ కస్తూరి రంగయ్యంగా రిట్లు ప్రశంసించిరి.
“ధర్మపు స్తక భాండాగారముల నెలకొల్పు ఉద్యమములలో కేవలము ప్రజలచే నిర్వహింపబడునది. ఆంధ్రదేశ గ్రంథాల యోద్యమము. ఈ యుద్యమము మన దేశ మందు తెలుగు జిల్లాలన్ని టిలోను వ్యాపించియున్నది. దేశాభ్యుదయ కారకమగు నుద్యమములలో సగ్రగణ్యమగు దీనిని వ్యాపింపజేయు బుద్ధిమంతుల యాదర్శములును, ఉద్దేశ్యములును మిక్కిలి ప్రశంసనీయములు. ఇంతవరకును వారి యుద్యమము జయప్రదముగ వ్యాపించు చున్నందులకు మనమందరము సంతసింపవలయు. 'స్వదేశ పరదేశ గ్రంథాలయములు' అను శీర్షికతో ఆంధ్రదేశ గ్రంథాలయ యాధ్యక్షులగు సూరి వెంకటనరసింహశాస్త్రిగారిచే వ్రాయబడిన పుస్తక రాజమందు గ్ర౦థాలయోద్యమ వ్యాప్తియు, నయ్యది జాతీయాభ్యుదయమున కింతవర కెన్ని విధముల సహాయ పడినదియు తేట తెల్లముగ తెలుపబడినది. ఈ గ్రంథమందు శాస్త్రి గారు గ్రంథాలయోద్యమమువలన నీ నీ క్రిందిలాభముల నిర్దేశించియున్నారు. దేశ భాషలయందు గ్రంధములు వృద్ధిజెందుటయు, వ్రాసిన చారిత్రక శాస్త్రిక గ్రంధములు ముద్రించుటకు తగిన సౌకర్యము పెంపొందుటయు, దేశాభిమానము జనసామాన్యహృదయము నాకర్షించుటయు మున్నగు లాభములీ యుద్యమము వలన సిద్ధించును.
“మన రాజధానియందును, ఇతర రాష్ట్రము లందును, ప్రముఖులందరకు నీ గ్రంధమవశ్యపఠనీయము. ఈ గ్రంధముచూచినచో తెలుగు జిల్లాలలో ఇట్టి మహోద్యమము వ్యాపించుచున్నదో తెలియుట యేకాక, ఇంతవరకు నిట్టి సదుద్యమము నుపేక్షించినవారెంత పాటుపడవలయునో విశదమగును”.
ఇందువలన మన యుద్యమమున కెట్టి ప్రాముఖ్యతయు, ఎట్టి ప్రచారణయు ఇంతవరకు లభించెనో తమకు విధితము కాకపోదు. గడచిన సభ జరిగిన ఆరుమాసములుకూడ జరగక పూర్వమే మనము తిరిగి సమావేశమగుచుండుట చేత ఈ స్వల్ప కాలమందలి ఉద్యమచరిత్రను గూర్చి చెప్పవలసిన సంగతులు ఎక్కువగా లేవు. విషయములు తక్కువైనను ప్రతివిషయమునకును ప్రాముఖ్యత మాత్రము మెండు.
మన గవర్నరుగారికి గ్రంథాలయోద్యమ మందుగల సానుభూతినిగూర్చి ప్రశంసించియుంటిని. వారీ యుద్యమప్రచారణతో కూడిన పనులన్నియు నూతనముగా స్థాపింపబడిన పబ్లిసిటిబోర్డు ద్వారా జరిపెదమని సెలవిచ్చిరి. ఆసావకాశము ననుసరించి ఈ యుద్యమమును గూర్చిన విషయములన్నియు పబ్లిసిటీ ఆఫీసరుగారగు జె. టి. గ్విన్నిగారికి విపులముగా నివేదించి వారినికూడ మన యుద్యమముపట్ల మిక్కిలి అభిమానులుగ చేయగల్గితిమి. ఇందుకు ఫలితముగ గ్రంధాల యోద్యమమునకు దొరతనమువారు సహాయము చేయుటను గూర్చి కొంతవిచారణ జరుగుటకు ప్రారంభమాయెను. ఈ సమయమున ఆంధ్రనాయకులు శ్రీయుత గౌరవనీయులగు కొండా వెంకటప్పయ్య పంతులుగారు గ్రంథా