Jump to content

పుట:Gopinatha-Ramayanamu1.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠినాఁడు శృంగిబేరపురప్రవేశము. గుహునితో సమాగమము.

“ఆససాద మహాబాహు శ్శ్రుంగిబేరపురం ప్రతి"

(అయో. 50. స.)

సప్తమినాఁడు వనస్పతిమూలనివాసము.

"ఆదాయ మేథ్యం త్వరితం బుభుక్షితౌ
వాసాయ కాలే యయతు ర్వనస్పతిమ్.”

(అయో. 52. 102.)

అష్టమిరోజున భరద్వాజాశ్రమముఁ జేరుట.

"గత్వా ముహూర్త నుధ్వానం భరద్వాజ ముపాగమత్"

(అయో. 54. స.)

నవమినాఁడు యమునాతీరముఁ జేరుట.

"అథా౽సాద్యతు కాళిందీం శీఘ్రస్రోత సమాపగామ్
చింతా మాపేదిరే సర్వే నదీజలతితీర్షవః."

(అయో. 54. 13.)

దశమినాఁడు సాయంకాలమందు సుమంత్రుఁ డయోధ్యను బ్రవేశించెను.

"అనుజ్ఞాత స్సుమంత్రో౽ధ యోజయిత్వా హయోత్తమాన్,
ఆయోధ్యా మేన నగరీం ప్రయయౌ గాఢదుర్మనాః.
తత స్సాయహ్నసమయే తృతీయే౽హని సారథిః,
అయోధ్యాం సమనుప్రాప్య నిరానందాం దదర్శహ.”

(అయో. 57. 4.)

ఆరాత్రియందే దశరథుఁడు స్వర్గతుఁ డగు . ఏకాదశినాఁడు దశరథునిమృతకళేబరము తైలద్రోణిలో నుంచఁబడినది.

"స రాజాం రజనీం షష్ఠీం రామే ప్రవ్రాజితే వనమ్,
అర్ధరాత్రో దశరథ స్సంస్మరన్ దుష్కృతం కృతమ్.”

(అయో. 63. 4.)

"తైలద్రోణ్యా మథామాత్యా స్సంవేశ్య జగతీపతిమ్,
రాజ స్సర్వా ణ్యథాదిష్టా శ్చక్రుః కర్మాణ్యనంతరమ్."

(అయో. 66. 14.)

ద్వాదశినాఁడు భరతునివద్దకు దూతల నంపుట.

“వసిష్ఠే నాభ్యనుజ్ఞాతా దూతా స్సంత్వరితా యయుః”

(అయో. 65. 11.)

ఆదూతలు త్రయోదశి చతుర్దశి మార్గమందుఁ గడపి పౌర్ణమినాఁటి రాత్రి కేకయనగరమును బ్రవేశించిరి. పాడ్యమినాఁడు భరతుఁడు మాతులగృహమునుండి యయోధ్యకు బయలుదేఱెను. మార్గమధ్యమం దేడురాత్రులు గడపి యెనిమిదవరోజు నవమినాఁ డుదయమున కతిత్వరతో భరతుఁ డయోధ్యను బ్రవేశించెను.

"తాం పురీం పురుషవ్యాఘ్ర స్సప్తరాతోషితః పథి,
అయోధ్యా మగ్రతో దృష్ట్వా సారథిం వాక్య మబ్రవీత్.”

(అయో. 71, 18.)

ఆదినమందే దశరథునికి దహనాదిసంస్కారములు జరిగెను. ఆదినము మొదలుకొని పదుమూఁడురోజులవఱకు ననఁగా వైశాఖశుక్లపంచమివఱకు భరతుఁడు దశరథునికి శ్రాద్ధకర్మల నాచరించెను.