Jump to content

పుట:Gopinatha-Ramayanamu1.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈశ్లోకార్థము నాలోచింపఁగా శ్రీరామోత్పత్తికిఁ బరమగు పుష్యమీనక్షత్రయుక్తదినందు భరతుఁడు పుట్టె నని స్పష్టమగుచున్నది. ఇతఁడు పుట్టినదినమునకు మఱుచటిదినమునం దుదయకాలమున లక్ష్మణశత్రుఘ్నులు జన్మించి రని యుత్తరార్థమువలనఁ దెలియఁబడుచున్నది. ఇందువలన లక్ష్మణునికంటె భరతుఁడే జ్యేష్ఠుఁ డని యెఱుఁగవలయును. జ్యేష్ఠుఁ డెప్పుడును కనిష్ఠునికి నమస్కరించుట యుచితము కాదుగదా! ఇ ట్లుండఁగా —

"ఇతి లోకసమాకృష్టః పాదేష్వద్య ప్రసాదయన్,
రామస్య నిపతిష్యామి సీతాయా లక్ష్మణస్య వా.”

(అయో. 99. 17)

"అంకే భరత మారోప్య ముదితః పరిషస్వజే,
తతో లక్ష్మణ మాసాద్య వైదేహీం చ పరంతపః.
అభివాద్య తతః ప్రీతో భరతో నామ చాబ్రవీత్.”

(యుద్ధ. 130. 40.)

ఈశ్లోకములయందు “లక్ష్మణ మాసాద్య” “అభివాద్య” “నామచా బ్రవీత్" అని కంఠోక్తముగాఁ జెప్పఁబడియున్నది.

“ఏవం దత్వా తత స్సీతాం మంత్రోదకపురస్కృతామ్,
అబ్రవీ జ్జనకో రాజా హర్షే ణాభిపరిఫ్లుతః.
లక్ష్మణాగచ్ఛ భద్రం తే ఊర్మిళా ముద్యతాం మయా,
ప్రతీచ్ఛ పాణిం గృష్ణీష్వ మాభూ త్కాలస్య పర్యయః.
త మేవ ముక్త్వా భరతం జనక శ్చాభ్యభాషత,
గృహాణ పాణిం మాండవ్యాః పాణినా రఘునందన!
శత్రుఘ్నం చాపి ధర్మాత్మా అబ్రవీ జ్జనకేశ్వరః,
శ్రుతకీర్త్యా మహాబాహో! పాణిం గృష్ణీష్వపాణినా.”

(బాల. 73. స.)

అను నీశ్లోకముల ననుసరించి వివాహసమయమందు మొదట రామునికి సీత యీయఁబడియె. తరువాత లక్ష్మణుని కూర్మిళయు, భరతునికి మాండవియుఁ గడపట శత్రుఘ్నునికి శ్రుతకీర్తియు నీయఁబడిరి. ఈరీతిగాఁ గన్యాప్రదానక్రమమందుఁ గూడ రామునితరువాత జనకునిచే లక్ష్మణుఁ డుద్దేశింపఁబడియెఁ గాని భరతుఁ డుద్దేశింపఁబడలేదు. ఇందువలన భరతునికంటె లక్ష్మణుఁడే జ్యేష్ఠుఁ డనునంశము వెల్లడియగుచున్నది. ఇతరరామాయణములయందుఁ గూడ నీవాల్మీకిరామాయణప్రతిపాదితకన్యాదానక్రమమే యనుసరింపఁబడినది కనిష్ఠునికి జ్యేష్ఠుఁడు వందన మాచరించుట గాని, జ్యేష్ఠునికంటె ముందు కనిష్ఠునికిఁ గన్యాప్రదానము చేయుటగాని యుక్తము కాదు. కావునఁ బైని వ్రాసిన యుక్తిద్వయమువలనను —

"సీతా మాదాయ గచ్ఛ త్వ మగ్రతో భరతాగ్రజ!
పృష్ఠతో౽హం గమిష్యామి సాయుధో ద్విపదాం నర!

(అయో. 55.)

ఇత్యాదిప్రమాణములవలనను భరతునికంటె లక్ష్మణుఁడే జ్యేష్ఠుఁ డని పూర్వ