Jump to content

పుట:Gopinatha-Ramayanamu1.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దర్భలు పఱుచుకొని ప్రాయోపవిష్టుఁ డై పడియుండుటకు నిశ్చయించెను. రాముఁ డతనియుద్యమమును వారించి

"కులీన స్సత్వసంపన్న స్తేజస్వీ చరిత్రవ్రతః
... ... ... ... ...
వ్యాదిశ్య చి మహాతేజా దివం దశరథో గతః"

(అయో. 104. 16-24.)

"మ.

అనఘాత్మా! చరితవ్రతుండు నిజవంశాచారసంరక్షణుం
... ... ... ... ... ...


సీ.తే.

... ... ... ... ...
మనుభవింపుము తగ సందియంబు వదలి. ”

(గోపీ. అయో. 1988-1993.)

అని ధర్మాధర్మప్రదర్శనపూర్వకముగా బోధించి

"లక్ష్మీ శ్చంద్రా దపేయా ద్వా హిమవాన్ వా హిమం త్యజేత్
... ... ... ... ... ...
న త న్మనసి కర్తవ్యం వర్తితవ్యంచ మాతృవత్.”

(అయో. 112. 18-19)

"క.

కమలారి కాంతి వీడిన, హిమవంతుం డాత్మనిష్ఠ హిమము విడిచినన్
గమలనిధి వేల దాఁటినఁ, గ్రమమునఁ బితృశాసనంబుఁ గడతునె యనఘా!


క.

అనఘవిచారక! కామం, బుననైనను రాజ్యలోభముననైన భవ
జ్జనయిత్రి నీకుఁ గా నిదొ, కనికని కావించె నింకఁ గడపఁగ నగునే?”

(గోపీ. అయో. 2139-2140)

అని దృఢప్రతిజ్ఞుఁ డై యున్న రామునిఁ జూచి భరతుఁ డిట్లనియె.

"అధిరోహార్యపాదాభ్యాం పాదుకే హేమభూషితే
... ... ... ... ... ...
నద్రక్ష్యామి యది త్వాం తు ప్రవేశ్యామి హుతాశనమ్.”

(అయో. 112. 21-26.)

"సీ.

తరణివంశోత్తమ! ధర్మసంహిత మైన ... ... ...


సీ.

... ... ... ... ...
జంద్రసూర్యాగ్ను లొక్కట సాక్షిగాఁగ"

(గోపీ. అయో. 2149-2148.)

అని పలికి స్వలంకృతం బైనరామపాదుకాద్వయంబుఁ బ్రతిగ్రహించి నిజశీర్షంబున నిడికొని రథారూఢుఁ డై నిజపరివారంబుతో నయోధ్యకుం జనియె.

ఇట్లు భరతుఁడు పదునాలుగేండ్లును రామవియోగానలదందహ్యమానస్వాంతుం డై శరీరసౌఖ్యము నపేక్షింపక రామునివలె జటావల్కలముల ధరించి వస్యఫలమూలమాత్రనిర్వర్తితదేహయాత్రుఁ డై తల్లివలనఁ దనకుఁ గలిగినదుర్యశమునుగుఱించి యనవరతము దుఃఖించుచు లోకమునకుఁ దనముఖమును జూపలేక లజ్జితుఁ డై

“అత్యంత సుఖసంవృద్ధి సుకుమార స్సుఖోచితః
కథం న్వపరరాత్రేషు సరయూ మవగాహతే.”