పుట:Gopinatha-Ramayanamu1.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక

7


తే.

అట్టిసర్వజ్ఞునకు గౌరియనఁగ నార్య, యనఁగ శ్యామయనఁగ శివయనఁగ సర్వ
మంగళయనంగ సతియనమహితభద్ర, యగుచుఁ గామాక్షిదేవి యర్ధాంగి యయ్యె.

41


క.

ఆయిరువుర కుదయించిరి, పాయక భగవంతుఁడైన భగవంతుఁడు సు
శ్రీయుతుఁడు బుచ్చనార్యుం, డాయతసత్పథగు లగుచు నర్యమసములై.

42


తే.

అంత భగవంతుపరిణయానంతరమున, నతనికూరిమితమ్ముఁ డద్భుతుఁడు బుచ్చ
నార్యుఁ డారీతి ననసూయ నత్రివోలెఁ, బ్రేమతోఁ గోనమాంబను బెండ్లియయ్యె.

43


క.

ఆమిథునమునకుఁ గల్గిరి, ధీమహితులు నారసింహధృతిశాలి యశో
ధాముఁడు రామాగ్రజసు, త్రాముఁడు విభవాభిరామ రామానుతు లై.

44


క.

అందగ్రజుండు విప్రపు, రందరుఁ డనఁ బొగడు గనెఁ బురందరకరిస
త్కుందేందుశారదాంబుద, చందనయశుఁ డగుచు నరసశాస్త్రి వసుధలోన్.

45


తే.

ఆనరసశాస్త్రిసతి వెంకమాంబ పతికి, భోగసౌభాగ్యనిత్యవిభూతు లొసఁగుఁ
దనువు సగముగ నొనరించి ధవుని బికిర, మెత్తఁ జేసిన గిరిపుత్రి నీసడించి.

46


ఉ.

ఆమహనీయమూర్తికి సమంచితకీర్తికి వెంకమాంబయం
దీమహిఁ బద్మనాభుఁ డన నెంతయు నొప్పెడుపద్మనాభుఁడున్
సోమనిభుండు బుచ్చనయు సొం పలరన్ వరదుండు భూరివి
ద్యా మహిమాఢ్యుఁ డీతఁ డన నాభగవంతుఁడు గల్గి రిమ్ముగన్.

47


క.

వారలలో నగ్రజుఁ డగు, నారాయణసముఁడు పద్మనాభుఁడు వెలసెన్
హారాంబుజహీరాంబుజ, వైరిపటీరహరహారవర్ధితయశుఁడై.

48


తే.

నయవిశారదుఁ డగు పద్మనాభునకుఁ బు
రంధ్రి వేంకటలక్ష్మ్యంబ రహి వహించెఁ
గలిమిజవ్వని యన నెల్లకడల సిరులు
పరఁగ వెదచల్లు జలజాతపాణి యగుచు.

49


క.

హరునకు సుమకైటభసం, హరునకు రమ పద్మయోని కలవాణి నిశా
కరునకు రోహిణిక్రియ నా, సరసున కద్దేవి ధర్మచారిణి యయ్యెన్.

50


ఆ.

చంద్రశేఖరునకు శైలజ కెనయగు, పద్మనాభునకును బరఁగ లక్ష్మి
కొనర వేంకటాఖ్య నుదయించితిఁ గుమార, మదనుఁ డనఁగ నేను మహిమ వెలసి.

51


సీ.

చిత్తంబు హరిగుణచింతనంబులయందు శయములు విష్ణుపూజనములందుఁ
బాదంబులు రమాధిపతిభజనమునందు వీనులు విభుకథ ల్వినుటయందు
శిరము కైటభదైత్యహరనమస్కృతులందు రసన గోవిందకీర్తనమునందుఁ
జక్షువు ల్హరిరూపసందర్శనమునందుఁ గాయంబు శౌరికైంకర్యమందు


తే.

సంతతము గీలుకొల్పి ప్రసన్నబుద్ధి, నన్యమేమియు నెఱుఁగక యవ్విభుండె
శరణమని నమ్మి కొలుచుచు ధర శరీర, యాత్ర నలుపుదు సన్మార్గ మధిగమించి.

52