పుట:Goopa danpatulu.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
78

గోపదంపతులు

యతడు మరలనడుగ నామె కస్లోచించుకొనుట కవకాశముచాలమి నిట్టులనె. “అయ్యా! మీరు మాటలాడదలచుకొన్న మాటలిప్పుడే చెప్పరాదా? రేయి నొంటికత్తెనై వచ్చుటకు నామగడనుమతించునా? నాచెలికత్తెలతో నేను దారి దప్పినందును. మీరేదేని యేకాంతస్దలముం జూడుడు. అక్కడకేగి మాటాడుదము.” ఈమాటలువిని రామయ్య నలువలంకుల జూచెను. ఎచ్చటజూచిన జనులు తండోపతండములుగ గంపట్టుచున్నారు. ఇప్పుడాడిన మాటలే యెవ్వరేని వినియుందురేమో యని యరడు మిక్కిలి మెల్లని కంఠధ్వని తో మాటాడెను. రామయ్య మహాధని యాటచేతను, గంగమ్మ వ్యాయామ క్రీడావిశాదలలో నగ్రగణ్య యౌటచే తను, జెన్నపురియందు వారివురి నెఱుగని వారుండరు. వారొక యేకాంతస్దలమున భాషించుచుండుట యెవ్వరికంటనేని బడినయెడల నింద మస్పకమానరు. దాన రామయ్యకు గాకపోయినను గంగమ్మకేని చేటుగలుగును. కావున రామయ్య యేమియు బాలువోక చూచుచుండెను. అప్పుడునటేశ మిట్లనియె. “తమ్ముడా! మాతమ్ముడగు సుందరముచెట్టి పెట్టిన హార్మోనియమల, యంగడి యీప్రక్కనే గలదు. అందుజనులంతగా నుండరు. నేనక్కడికి ముందుగాజని యెవ్వరులేకుండాజూచి మిమ్ముబిలుచెదను. అచ్చటికిరండు. మీయిచ్చవచ్చినంతసేపు మాటాడికొనవచ్చు“ న ఎను. రామయ్యప్రముదితుడయ్యెను. గంగమ్మ వల్లెయనియె. మాయాపిశాచ