సురవరం ప్రతాపరెడ్డి
19
మున్నగు విద్యాలయముల మూలమున దాదాపు అర్ధశతాబ్దముననైన యభివృద్ధితో సమానముగా నున్నదని పలువురు వక్కాణించుచున్నారు.
పరిపాలనము యొక్క ఇతర శాఖలందును ఎన్నియో మార్పులు జరిగినవి. ఇవి యన్నియు ప్రజాహితము కొరకు శ్రీ ప్రభువుగారు శ్రద్ధతో నాలోచించి చేసిరి.
ప్రజా క్షేమ తత్పరులగు మన ప్రభువుగారి పక్షమున కొన్ని మాసముల క్రింద “సంస్కారములు" చేయబడునని ప్రకటింపబడినది. అట్టి సంస్కారములలో మొదటి కార్యముగా క్రొత్త యధికారులు నియమింపబడుచున్నారు. మాల్గుజారీయందు గొప్ప మార్పులు జరిగి ముఖ్యాతిముఖ్యమగు నీ శాఖ మూలమున దేశాభివృద్ధి కలుగునని మేము విశ్వసించుచున్నాము.
ఇచ్చట శాసన నిర్మాణ సభను ప్రజా ప్రాతినిధ్య పద్ధతిపైన సంస్కరించుటకు శ్రీవారు కొన్ని వత్సరముల క్రింద నాజ్ఞాపించిరి. ఈ విషయమున కావలసిన అంకెలను వివరములును సిద్ధము కూడనై నవి. గత మాసమున ప్రధానామాత్యులగు శ్రీ మహారాజా బహద్దరుగారు శాసన నిర్మాణ సభ యందు, అనధికార సభాసదులతో, సంస్కార విషయములను సానుభూతితో నాలోచింతుమని సెలవిచ్చి ప్రజలయందుత్సాహమును ప్రతిష్ఠింపజేసిరి. ఇది యంతయు మన ప్రభువుగారి ప్రజా వాత్సల్య విశేషము. శ్రీవారి జన్మోత్సవ సందర్భమున గాని ఇతర సందర్భమునగాని ముఖ్యముగా నీ సంస్కారము ప్రవేశపెట్టుట మహా శుభ ప్రదమనియు, పరిపాలనమునందు ప్రజల తోడ్పాటు నిజముగా మనరాజ్యమును దుర్భేద్యముగా నొనర్చుననియు వినయ పూర్వకముగ సూచించు చున్నాము.
శ్రీ ప్రభువుగారు ప్రజా క్షేమంకరులై చిరకాలము వర్ధిల్లుదురుగాక ! నిజాం రాష్ట్రవాసులు ప్రపంచమందలి ఏ నాగరిక రాష్ట్రవాసులకును స్వాతంత్ర్యమునందును, విద్యాధికములందును తీసిపోక స్వదేశాభ్యుదయమునకు తోడ్పడునట్లు పరమేశ్వరుడనుగ్రహించు గాక !