ఈ పుట ఆమోదించబడ్డది
విజ్ఞాపన
10 - 5 - 1926
రెసిడెన్సీ హద్దులలో నున్న మా ముద్రణాలయము నుండి పత్రికను ప్రకటించుటకనుమతి యొసంగ బడక పోవుటచే, నిజాం ప్రభుత్వము వారి హద్దులలోనికి, ముద్రణా యంత్రమును మార్చవలసి వచ్చుట చేతను, పోస్టలు శాఖ వారనుమతి నిచ్చుటలో నాలసించుట చేతను, మేము, తొలుదొల్త ప్రకటించిన రీతిని పత్రిక నందజేయ జాలమైతిమి లేకుండిన పత్రిక యొక్క మాసము క్రిందటనే వెలువడి యుండెడిది.
రాబోవు పత్రిక వైశాఖ శు॥ 5 స్థిరవారమున వెలువడును. తదనంతరము క్రమముగ, ప్రతి బుధవారమునను శనివారమునను పత్రికలు ప్రకటింపబడును.