Jump to content

పుట:Golakonda patrika sampadakeeyalu.pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పత్రికలకు ప్రభుత్వాదరణము

18 - 2 - 1935

మన రాష్ట్రములో ఉర్దు పత్రికలు పెక్కుగలవు తెలుగులో నొకటే ఇంగ్లీషులో నొకటే - మరాటీలో నొకటే - కన్నడీ కిదియు లేదు ఉర్దూ పత్రికలు రెండు డజనులకు పైగా (దిన, వార, పక్ష, మాస, త్రైమాస వగైరాలు చేరి) ఉన్నను వానికార్ధిక లోపము కానరాదు బులెటిన్ పత్రిక మూడు మారులు నాయకత్వము మార్చుకొనెను తెలుగులో రెండు మూడు వారపత్రికలు, రెండు మూడు మాసపత్రికలు ముచ్చటగా మూన్నాళ్ళుండి యంతర్హితమయ్యెను ఇక మినుకు మినుకు మనునది గోలకొండ పత్రిక యొకటే మహారాష్ట్రములో నిజాం విజయ కాలధర్మము నొందు సమయములో ప్రభుత్వమువారు సహాయముచేసి (నెలకు 100 రూపాయీల ప్రకారమని వినికిడి) దాని ప్రాణములు నిలుపు పుణ్యము కట్టుకొనిరి కనడికి దిక్కెలేదు

ఇట్టి పరిస్థితులలో నెవ్వరినేని ఉర్దు పత్రికలకు ప్రభుత్వము సహాయము చేయు నవసరము కలదా లేక యీ యితర భాషా పత్రికలకు సహాయ మవసరమా అని విచారించిన రెండవ శాఖ వాటికేయని యెవరైన చెప్పుదురు కాని మన ప్రభుత్వమువారు ఉర్దు పత్రికలకే మహాయము చేయుచున్నారు. (నిజాం విజయ తప్ప)

ఉర్దూ పత్రికలలోను అన్నిటికి సాయముచేయుటలేదు అందుకొరకే యీ మధ్య "రహబరెదక్కన్, సుభేదక్కన్ పత్రికలలో వాదోప వాదములు జరుగుచున్నవి గోల్మేజు సభాకాలములో రహబరెదక్కను కిచ్చిన భృతి యొక్క వివరములివ్వియని సుభేదక్కన్ ఇట్లు వ్రాయుచున్నది.