తృతీయాంధ్ర మహాసభ
20 - 12 - 1934
ఈ సారి ఖమ్మములో జరిగిన మన రాష్ట్రపు తృతీయాంధ్ర మహాసభ విషయములో కల్పింపబడిన కొన్ని పరిస్థితులు నిర్వాహకులగు నాయకులకును మన ఆంధ్రుల సర్వతోముఖాభివృద్ధియే ముఖ్యోద్దేశముగా గల యీ ఆంధ్ర మహాసభల యందు అభిమానాదరములు గల వారికిని కొంత మనస్తాపమునకు కారణములైన వనుటకు చింతిల్ల వలసి యున్నది మొదట మహోత్సాహముతో మహాసభలో చర్చించదలచి చిత్తు తీర్మానముల పట్టికలో చేర్చబడినట్టియు, నేడు భరత ఖండములో నంతటను గొప్ప విద్యాధికులచే భారతీయులందరి సాంఘికాభివృద్ధికి అత్యవసరములని తలచబడు విషయములు గల్గినట్టియు రెండు మూడు తీర్మానములు మహాసభ వారి యెదుట చర్చకు రాలేదు. ప్రవేశ పెట్టబడను కూడా లేదు
మొదట యెవరు కాని యీ తీర్మానములందలి విషయములు మహాసభ వారికి - ఆమోదార్హములు గాక పోయిన పోనిమ్ము - అధమపక్షము ఆలోచించ దగినవి అని తలచి మహాసభా నిర్వాహకులకు తెలిపి యుండిననె గాని, అవి చిత్తు తీర్మానముల పట్టికలోకి యెక్కి యుండ జాలపు అట్టివారు తర్వాత తమ అభిప్రాయమును మార్చుకొని, సదరు తీర్మానములు మహాసభలో ప్రవేశ పెట్టుటకు కూడ తగనివను అభిప్రాయమునకు వచ్చిరా? లేక తీర్మానములను ఉప పాదింప దలచిన వారికి బలపరచువారు చిక్కక పోయిరా? ఈ రెండు వికల్పములలును సదరు తీర్మానములు మహాసభలో ప్రవేశ పెట్టబడ కుండుటకు కారణములు అనిపించునంత చపల చిత్తులు మన మధ్య లేరనియే మా విశ్వాసము మఱి యితర కారణమేమి?
ఇట్లు విషయమును త్రవ్వుటవల్ల సంతాపకరములగు రహస్యములు బయట పడునేమోః సనాతులను వారి యాందోళనచే పై జెప్పబడిన తీర్మానములు