Jump to content

పుట:Golakonda patrika sampadakeeyalu.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మన స్వదేశీ ఉద్యమము

21 - 6 - 1934

మ ఘ వ నిజాం ప్రభువరేణ్యుడు తమదేవిడిలో గోల్కొండ సబ్బులనే ఉపయోగించుచున్నామని చెప్పి నెలలు, సంవత్సరములు గడుచుచున్నవి - అప్పుడే ఉత్సాహముతో ప్రారంభమైన "బై - హైదరాబాదు లీగు" (హైద్రాబాదు వస్తువులనే కొనుడు అని ప్రచారము చేయుటకై పుట్టిన సంఘము) ఇప్పుడు ఎక్కడ నున్నది కూడ ప్రజల దృష్టికి వచ్చుట లేదు. గత దీపావళికి ముందు సంవత్సరపు దీపావళిలో నగరములో ప్లేగుండగా 'సదరు లీగు' సభ్యులు కొందరు తాము ప్రత్యేకముగా సాధ్యమైనంతవరకు కొన్ని కొన్ని ఇండ్లకుపోయి విదేశి వస్తువులను కొనకుండ ప్రబోధము చేసెదమని చెప్పి అట్లే చేసిరి. అంతటితో లీగులో చేరిన వ్యక్తులు గూడ మరల ఆ కార్యమువైపే దృష్టి మరల్చుట మాని నట్లున్నది. లీగు పని చేయుచున్నచో కొద్దికొద్దిగానైనను ఆ విషయము తెలియును కదా. ఈ విధముగా పనిచేసినచో ఏ రాష్ట్రమందుగాని స్వదేశీ అభిమానము ఎంత కాలమునకు ప్రజాసామాన్యమందు వ్యాపించగలదు దయామయులు అగు ప్రభువుగారు ప్రోత్సాహమిచ్చి మార్గము చూపుచున్నను ఈ విధముగా ప్రజలు మాంద్యము చూపుచున్నపుడు ప్రభుత్వము వారి ప్రోత్సాహము లేకపోగా మీదు మిక్కిలి వారివలన ఆటంకము కలుగుచో - ఒక విధముగా చూచిన ఆ సందర్భములో ప్రభుత్వము వారిని అనవలసిన పని యేమి యుండదు.

ప్లేగువలన తమ ఉద్యమ ప్రచారమును ఆపవలసి వచ్చినది అను వారు ప్లేగు తగ్గగానే ప్రచారమునకు పూనుకొనియుండుట యుక్తము. అయితే యిపుడు ఆ ప్లేగు పోయినది-మరల ప్లేగు తగ్గినది స్ఫోటకము విజృంబించియుండి తగ్గుచున్నది ఈ విధముగా కాల పరివర్తనమే గాని క్రియ శూన్యముగా నున్నది

కథియవాడ ద్వీపకల్పములో అనేకములైన చిన్న చిన్న సంస్థానములు గలవు. ఈ సంస్థానములలో శాసనోల్లంఘనోద్యమ కాలమున స్వదేశీ ఉద్యమము