Jump to content

పుట:Golakonda patrika sampadakeeyalu.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సురవరం ప్రతాపరెడ్డి

163

శూన్యులగు స్వయంకృత నాయకులచే దేశము ముండ్లకంపలలోగాని గుట్టలలోగాని బడక సురక్షితముగా స్వరాజ్య మహా సౌధము జేరుటకు ఆవకాశము నిలిచియున్నదను భావమును సర్ మీర్జా గారు సూచించిరి.

సర్ మీర్జా ఇస్మెయిలుగారికి గాంధీ మహాత్ముని పొగడవలసిన అవసరము సత్యముజెప్పుట తప్ప వేరొండుగలదని తలంచుటకు ఆధారము ఏదిగాని లేదు. సాధారణముగా సంస్థానాధిపతులు నిరంకుశాధికార ప్రియులుగనుకను క్రమ విరుద్ధమగు నిరంకుశత్వమునకు గాంధి గారు దూరులుగనుకను సంస్థాన ప్రభువుల కొలువులో నుండు అధికారులు తక్కువ వారైననేమి గొప్పవారైననేమి అధమ పక్షము బహిరంగముగానైనను గాంధీ మహాత్ముని మతమునెడ విరోధభావము చూపవలసియుండగా మైసూరు సంస్థానపు దివానుగారు గాంధీ గారిని ధైర్యముతో కొనియాడుటవలన ఇతర సంస్థానములకును మైసూరునకును గల భేదము సూచితమగుచున్నది. మైసూరులో ప్రభుత్వము ప్రజాభిప్రాయము ఏర్పరచు హద్దులను గమనించుచు ప్రవర్తించునట్లు ఇతర సంస్థానములలో లేదు. గాంధీ మహాత్ముడు ఆఖరుకు కోరునది ప్రజాసామాన్యము యొక్క లాభ క్షేమములను గూర్చిన వివిధాభిప్రాయములను విని విచారించి ప్రభుత్వము అధిక సంఖ్యాకులకు మేలగురీతిని వర్తింపవలయుననియే ఈ అభిప్రాయమందు దోషమేమియు లేకుండుటయేగాక తదనుసారము ఆచరించుటవలన మేలుగలదు

సంస్థాన ప్రభువులు తమ ప్రజల సౌఖ్యమే తమ సౌఖ్యముగా నెంచు ఉదారాశయులగుచో తమ ప్రభుత్వమునకు ప్రజాభిప్రాయపు ఒత్తిడి తగులటకు అంగీకరింపవలెను ఈ కాలమున ఏ రాజ్యములోగాని, ముఖ్యముగా, మన హిందూ దేశమందలి రాజ్యములలో ఒక దానికి నొక దానికి సంఘర్షణ కలుగుటకు అవకాశముతో గూడిన అనేకములగు తరగతులు లేక తెగలు గలవు. మొత్తము మీద రాజ్యమంతటికిని క్షేమాభివృద్ధులు కలుగవలయునని నీ విధములైన తెగల విరోధములను సరిపెట్టవలసియున్నది. అందుకు ఏఏ తెగలవారికి ఏదేది ఎక్కువ లాభకరమో ఏదేని చెరుపో కనుగొనుట ముందు ముఖ్యావసరము వాటిని బట్టి ప్రభుత్వము వారి తీర్మానము ఉండవలసియుండును. ఈ విషయమునే 'ప్రజాభిప్రాయము కనుగొనుట అవసరమని' అందురు దీనినే మిర్జా గారిట్లు చెప్పిరి. “అది (క్రొత్త రాజ్యాంగము) వివేకవంతులగు ప్రజలకు యిష్టమగు గాక, న్యాయబద్ధ పరిపాలనము అయిష్టము పైననే ఆధారపడి యున్నది."