ఈ పుటను అచ్చుదిద్దలేదు
8. పె.రామకుమారిగారు:-
అంగన (తూ.గో) పాడుగుపాండురంగదాసుగారి శిష్యురాలు. బ్రహ్మంగారిచరిత్ర సీరియల్ గా ఎన్నో చోట్లచెప్పి గౌరవింపబడ్డారు.
9. సుశీల భాగవతారిణిగారు:-
రాజమండ్రి మొదట్లోబేతా రామచంద్రరావుగారిట్రూపులో నాటకాలు వేసేవారు. అనంతరం కధలునేర్చుకుని యీరంగంలోకృషిచేస్తున్న విదుషీమణి. ఈగ్రంధరచయితతో కలిసి "సుభాస్ చంద్రబోసు" జముకుల కధకూడా చక్కగాఫ్చెప్పేరు.
10. దువ్వూరి సత్యవతి భాగవతారిణిగారు:-
కాకినాడ. దీక్షితదాసుగారి శిష్యురాలు. తులసీజలంధర, మారుతి చిటికెలు, సతీసుమరి, ద్రౌపదీస్వయంవరం, ద్రౌపదీమానసంరక్షణం, సుగ్రీవవిజయం, కృష్ణరాయంబారం మున్నగు విదికధలు చెబుతారు. ద్రౌపదీమానసంరక్షణం వీరికి గుర్తింపుతెచ్చినకధ. మార్కాపురంలో "గానకోకిల" బిరుదుతో సత్కారించారు.
11. రంగమాంబభాగవతారిణిగారు:-
భీమవరం. మంచికధకురాలు. భారతం నెలరోజులు సీరియల్ గాచెప్పి మెప్పిందిట్టగా పేరుగన్నారు. వల్లీకళ్యాణం అద్భుతంగా చెబుతారు. పద్యంచదవడంలో యీమెమధురగాత్రం యీమకు వరం.
12. అచ్చమాంబ భాగవతారిణిగారు:-
కాకినాడ. నారాయణదాసుగారువ్రాసిన సావిత్రిచరిత్రే, యితర విదికధలూ యించుమించు 10 దాకా చెబుతారు.
13.శార్వాణీ భాగవతారిణిగారు:-
కాకినాడ. ఈమెకధలో పాండిత్యంఎక్కువ. రామాయణం సీరియల్ చెబుతారు. చాలాచోత్ల సన్మానాలుపొందారు.
14. కొచ్దెర్లమల్లేశ్వరి భాగవతారిణిగారు:-
భీమవరం. ఈమచక్కని నాట్యంతో కీర్తనలుపాడి అభిఉనయంతో కధనడిపిస్తారు. సినీపా'టలుచక్కగా అనుకరిస్తారు. ప్రేక్షకులమీద యిదో సమ్మోహనం.