ఈ పుటను అచ్చుదిద్దలేదు
చెప్పేవారు. ఘంటాకంతలు, కేయూరసన్మానాలు, బిరుదులుపొందారు. వీరి సంపాదన దానధర్మాలక్రిందే ఖర్చు.
30. శ్రీ ఉయ్యూరు బులిరాజు భాగవతార్:-
వీరిది అంగర. (తూ.గో) వీరుకూడా రచయిత, కధకుడు, భారతం సీరియల్ గా చెబుతారు. కధ సంగీతసాహిత్యపరంగా, భక్తిగా ఉంటుంది. ఇతర ప్రసంగాలూ, హాస్యోక్తులూలేకుండా కధను పోషిస్తూ చెబుతారు.
31. ఘట్టి శేషాద్రిశాస్త్రిగారు:-
తాదేపల్లీగూడెం. దీక్షితదాసుగారి శిష్యులు. చక్కని అనుభూతితో రక్తిగా కధచెబురారు. "దైవజ్ఞశిఖామణి"గా కూడా పేరుంది.
32. కొమ్ముసుబ్రహ్మణ్య వరప్రసాద్ గారు:-
ఆకివీడు (తూ.గో) ఎం.ఏ. పట్టభద్రులు. అని కధలూ సాహిత్యపరంగా చెబుతారు.
33. నల్లమిల్లి నర్రేడ్డిగారు:-
రాయవరం. (తూ.గో) వీరు నల్లమిల్లిబసివిరెడ్ది భాగవతారు గారి సోదరులు, శిష్యులు. అన్నగారిఛాయలొ అక్కడక్కడ విడికధలు చెప్పేవారు. కధ సూటిగాచెప్పడం వీరిప్రత్యేకత.
34. పులగం సత్యనారాయణరెడ్దిగారు:-
కుతుకులూరు (తూ.గో.) వీరు నల్లమిల్లి బసివిరెడ్దిగారి వద్ద వయొలిన్ వాయిస్తూ వారిదగ్గర కధలు నేర్చుకుని అనంతరం కధకులుగా భారత గాధలు చెప్పేవారు. వీరి కధలోని మధురమైన సంగీతం జనాన్ని విశేషంగా ఆకర్షించేది.
35 డా: నల్లమిల్లి బాపిరెడ్దిగారు. ఎం.ఏ.ఫిహెచ్ డి.
రాయవరం (తూ.గో.) వీరు బసివిరెడ్దిగారికుమారుడు, శిష్యుడు కూడా. బాల్యం లో నే తండ్రిననుసరించి కధలకు వెళుతూ వారిదగ్గర కధలునేర్చుకుని చిన్నప్పుడే మంచికధకులుగా పేరుతెచ్చుకున్నారు. ఎదిగాక ఎం.ఏ. పాసై రమచంద్రపురం వి.యస్. యం. కళాశాలలో తెలుగుశాఖాధ్యక్షులుగా పనిచేస్తున్నారు.