ఈ పుటను అచ్చుదిద్దలేదు
24. సలాది భాస్కరరావుగారు:-
కాకినాడ. వీరుచెప్పేకధ నర్తనశాల. సమకాలిక రాజకీయాల మిళాయింపు వీరికధలో క్రొత్తదనం. అందులో హేతుబద్ధంగాచేసే విమర్శలు, కట్టమంచి రామలింగారెడ్డిగరివంటి సాహితీవేత్తల గ్రంధాల పరామర్శలు, జనబాహుళ్యాన్ని ఉర్రూతలూగించే మసాలా దినుసులు.
25. వేదనభట్ల వెంకటరమణయ్యగారు:-
పిఠాపురం. వీరు దారాయణదాసుగారి శిష్యులు ఎన్నో చోట్ల రామాయణకధలుచెప్పి కీర్తిపొందారు. కరుణరసపోషణలో కధ రక్తిగా నడిపించే శక్తి వీరిది. విశాఖరేడియోస్టేషనులో నిలయ విద్వాంసులు.
26. అన్నంనీడి భాలకృష్ణదాసుగారు:-
రామచంద్రపురం. (తూ.గో) వీరుకూడా నరాయణదాసుగారి శిష్యులే. సాతిత్రైకహ్దకు వీరు పెట్టింది పేరు. సర్వజనరంజకంగా కధలు చెప్పి ఎన్నో సన్మానాలు, బిరుదులు పొందారు.
27. ఎం.టి. రావుగారు:-
రానమండ్రి. మొదట గున్నేశ్వరరావుగారి కంపెనీలో నటుడుగాను హార్మోనిష్టుగానూ తిరిగేవారు. తరువాత నారాయణదాసుగారి శిష్యరికంలో కధలునేర్చుకుని హరికధకునిగా వాసికెక్కారు.
28. పెడసనగంటి సోమయ్యగారు:-
రావులపాలెం. (తూ.గో) కధకులు, రచయిత కూడా. పూర్వపు బాణీలో రామాయణం, ఇతర విడికధలు చెప్పేవారు. విడికధలుచెప్పేటప్పుడు తెల్లవారిందాకా కధాగానం చేస్తూనే ఉండేవారు. వీరికి తెలిసినన్ని పూర్వగాధలు మరెవరికైనా తెలుసునంటే అనుమానమే. గొప్ప పండితులు కధ రక్తిగా, సాహిత్యపరంగా ఉండేది.
29. చింతా శివరామశాస్త్రిగారు:-
మురారి. (తూ.గో) వీరు వాజపయాజుల సుబ్బయ్యగారి శిష్యులు. రామాయణం సీరియల్ గా ఎన్నోచోట్ల చెప్పేవారు. ఎన్నో విదికధలు కూడా చెప్పేవారు. శృంగార, హాస్యరసాలు పొషిస్తూ ఆకర్షనీయంగా