ఈ పుటను అచ్చుదిద్దలేదు
17. చిట్టాల ఆంజనేయులుగారు:-
వీరిది రావిపాడు (తూ.గో) పెంటపాటి సుబ్బయ్యగరి శిష్యులు. వీరి భక్తమార్కండేయకధకు మంచిపేరు. రామాయణం వగైరా ఎన్నో కధలు చెప్పేవారు. మైకులులేని ఆరోజుల్లో వీరికధ రెండుమొడువేల మందికి వినిపించేది. అంతపెద్దగాత్రం. వీరరసపోషణ కధలే అధిక ప్రాధాన్యతపొందేది.
18. శ్రీ తెలికిచర్ల కృష్ణమూర్తి భాగవతార్:-
రాజమండ్రి. దీక్షితదాసుగారి శిష్యులు. వీరి "రామభక్తి" కధ ప్రసిద్ది. భక్తితో రక్తిగాచెప్పి అందర్నీ పారవశ్యంచేస్తారు. ఇతర కధలుకూడా ఎన్నో చెబుతారు.
19. పెదపాటి కృష్ణమూర్తిగారు:-
తాడేపల్లిగూడెం. పెంటపాటి సుబ్బయ్యగరిశిష్యులు. రచయిత, కధకులు, హరికధాపరిషత్ కు కార్యదర్శి. రామాయణం, భారతం, భాగవతాలను చెబుతారు. చాలామందిశిష్యుల్ని తయారుచేశారు.
20. మల్లది శ్రీరామమూర్తిగారు: -
ఏలూరు. డ్రాయింగుటీచరు - కధకులు, సంగీతసాహిత్యాల మేలుకలయిక వీరికధలో కనిపిస్తుంది. కధలో భక్తికి ప్రాధాన్య ఎక్కువ.
21. ముదపాక బాలసుందరంగారు:-
భీమవరం, యువకధకులు, ముదపాక మల్లేశ్వరరావుగారి తనయుడు, శిష్యుడుకూడా. కధ చురుకుగా రక్తిగా నదిపిస్తారు.
22. గొర్తి కొండయ్యశాస్త్రిగారు:-
వీరిది ఇందుపల్లి (తూ.గో) గొప్ప సాహితీవేత్త. తరుదు రామాయణం సీరియల్ గా చెప్పెవారు. కధలో సాహిత్యవాసనల గుభాళింపు ఎక్కువ.
22. అక్కిపెద్ది శ్రీరామశర్మగారు:-
కపిలెశ్వరపురం (తూ.గో) సర్వారాయహరికధా గురుకులంలో ఎంతోమందిశిష్యుల్ని తయారుచేశారు. వెరికధలో ప్రాముఖ్యం కధకే.