పాములను ధరించుటెంత పాపమో శివశివా
ఏమయా సాంబ శివశివా
వెర్రివాడవైన కావు వెండికొండకు దొరవునీవు
పుర్రెలో భుజించుటెంత పుణ్యమో శివశివా
ఏమయా సాంబ శివశివా
ఎల్లవేల్పులకును నీవు ఆదిమూలమైనవేల్పు
బిచ్చమెత్తుకొనుటనుటేంత కర్మమోశివశివా
ఏమయా సాంబశివశివా'.
స్త్రీలపాటలలో శ్రీరాముని ఉంగరంచూసిన సీతభావనతో కూర్చినపాట-
"ఉంగరమా ముద్దుటుంగరమా
నడువా కాళ్ళూలేవు ఎగురూ రెక్కలులేవు
ఏలాగూవచ్చితివే ఉంగరమా" అనేది కరుణ రసాత్మకమై కన్నీరు తెప్పిస్తుంది.
బియ్యం ఏరుకుంటూనో, వత్తులు చేసుకుంటూనో గృహిణులు భారత భాగవత రామాయణ ఘట్టాలను పాటలుగా పాడుతుంటారు. అందులో కృషలీలలు--
"కస్తూరి రంగరంగా నాయన్న
కావేటి రంగరంగా
శ్రీరంగ రంగరంగా
నినుబాసి ఏటులునే మరచుందురా
కంసుణ్ణి సంహరింప
కృష్ణావతారుడై జన్మించెను
ఎదుగాళ్ళనుపుట్టెను ఆ బాలు
డేడుగురు దాదులను చంపెనపుడు-
"వసుదేవ పుత్రుడమ్మా ఈ బిడ్డ
వైకుంఠ వసుడమ్మా
నవనీత చొరుడమ్మా ఈ బిడ్డ
నందగోపాలు డమ్మా"
అని స్థాయిగా పాడుతుంటే ఆ పాటల గమనానికీ, వస్తు విశేషానికీ అందరూ రాగరంజితులు కావలసిందే. అలాగే
పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/184
ఈ పుటను అచ్చుదిద్దలేదు