అన్నారు. దేవుడు భగవంతుని రూపములో చెప్పినది కావున దీనిని భగవద్గీత అన్నారు.
విచక్షణా దృష్ఠితో చూస్తే నీ గీతలోపల ఉండునదే భగవద్గీతయను గీతలో ఉన్నది. దేవుడు మానవుని ఊహకు ఎన్నో సిద్ధాంతములను అందించినట్లు "గీత" అను పదమును కూడ అందించాడు. గీత అంటే రేఖ అనియు, హద్దు అనియు, గీయబడిన గీత అనియు వ్రాయించాడు. అలా వ్రాయించుట వలన ఎప్పటికైన మానవుని బుద్ధికి సంశయమొచ్చి ఇది ఏ గీత? ఏ హద్దు? అని ప్రశ్నించుకొని జవాబుకొరకు ఎదురుచూస్తాడని దేవుని ఉద్ధేశ్యము. అలా చూచువానికి గీతలోని ధర్మములన్ని అర్థము కాగలవని ఆయన భావము. ఎంతో మనమంచి కోరి దేవుడు గీతను గీతగానే మనకు పరిచయము చేస్తే, దానిని తెలుసుకొందామను యోచన కొందరి బుద్ధికి రాక, ఏ నిఘంటువులోనిది ఈ అర్థము అని అడిగితే, వారు రాక్షస జాతివారో, దేవతల జాతివారో, వారినేమనాలో విూరే యోచించండి. నిఘంటువులలో (డిక్షనరీలలో) ప్రపంచ అర్థాలుండవచ్చును. కాని పరమాత్మ భావములుండవు. అట్లుంటే దేవుడు భూమి విూదకు వచ్చి తన జ్ఞానము ఇది అని చెప్పవలసిన పనిలేదు. ధర్మాలు అధర్మాలుగ మారినపుడే దేవుడు తన జ్ఞానమును తెలియజేస్తానన్నాడు. దేవుడు భగవంతునిగ భూమి విూదకు వచ్చినపుడు అధర్మపరులకు ధర్మములు రుచించవు. అందువలన శ్రీకృష్ణజన్మలోను, ఏసుప్రభువు జన్మలోను ఆయన మాటను ధిక్కరించినవారు, ఆయనకు ఇబ్బందులు కలుగజేసినవారు ఎందరో కలరు. ఆనాడే ధిక్కరించిన వారున్నపుడు, ఈనాడు మాలాంటివారిని తప్పుపట్టువారు ఎందరో ఉండవచ్చును. అటువంటి వారిని దృష్ఠిలో పెట్టుకోకుండ, దైవజ్ఞానము విూద శ్రద్ధకలవారికి వాస్తవ జ్ఞానము అందివ్వాలను ఉద్ధేశ్యముతో, గీత అనగా దేవునిచేత గీయబడిన గీత అని అర్థము చెప్పుచున్నాము.