పుట:Garimellavyasalu019809mbp.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నిశ్చయించుకొని కూర్చున్నా అది ఒక ధోరణిలో ప్రారంభం కావడం మధ్యన మరియొక ధోరణిలోకి పోవడం, తరువాత మరియొక ధోరణికి రావడం ఇది మామూలై పోయించు. ఇది నా చేతకానితనమని యైన కొదరనుకొవచ్చును. విషయమును బట్టి ధోరణి అట్లు మారవలసి వచ్చినదని యైనా కొందర్నుకోవచ్చును. ఇదైనా నాఒక్కని నుదుట వ్రాయబడ్డ వ్రాతలాగ కనిపించలేదు. ప్రస్తుత వార్తాపత్రికా సుప్రసిద్ధ విలేఖరులనుకొనబడే అనేకులు వ్రాతలలో యింత్రో కొంతో యిటువంటి భేదము అగుపించుచున్నవి. తొలిచూపుకు ఇద్ వెఱ్ఱి వెంగళఫ్ఫా ధోరణుల వలె కన్పించును. కాని న్ ఇదానించి చూస్తే యిది యీ విధంగా యీ కాలంలో వుండక తప్పదు కాబోలు ననిపించుతుంది. కేవలం పాఠ్యపుస్తకములను వ్రాసేవారు కొంచెం పట్టుపూరాగా పూర్వపుధోరణిలోనే వ్రాస్తున్నారు. లేకుంటే అవి పాఠ్యగ్రంధములుగా అంగీకరింపరేమో అన్నభావం చేతను, అయినా వారు ఆసమయముల యందు తీసుకునే అతి జాగ్రత్త, భయము, అవ్యగ్రత అందులో ఉంటే వచ్చే ఉపద్రవం యేమీ లేదు. అని బాలకులకు చూచించును కాని, పాఠశాలలను విడచి పెద్ద వారైన తరువాత వ్రాయగల గ్రంధములే ధోరణిలొ వ్రాయవలెనో నిర్భందించవు. కేవల పాఠ్యపుస్తకములు కాక గణితము, భూగోళము, చరిత్ర్ సైన్సు మొదలైన విషయములను వ్రాసే పుస్తకములలోని భాషైన్నికట్టుదిట్టములతో ఉండవలెనని నియమించ నక్కారలేదు. ఏ గ్రంధకర్తకు ఏ ధోరణి యే సమయమున బాగుంటుందని తోస్తే ఆధోరణీలోనే వ్రాయవచ్చును. ఆ పుస్తకములను విద్యార్ధులు పఠించడం ఆధోరణికొరకు కాదు. ఆ విషయ విజ్ఞానము కొరకు ఏ విషయమైనను సుగ్రాహ్యముగ ఉండవలెనంటే, ఆ యా సందర్భములకు తగినట్లు గ్రంధకర్తధోరణిని మార్చుకొనక తప్పదు. కనుక పాఠ్య గ్రంధ నిర్ణయమండలులవారు పూర్వపు అధికరములతో విఱ్ఱవీగి, నవీన గ్రంధములను ధోరణుల కారణముగా త్రోసివేయరాదు. విషయము మనోహరమై, అవశ్యమై యున్నప్పుడు, గ్రంధము ప్రవీణునిచే వ్రాయబడినప్పుడు వారు దేనినైనను అంగీకరించక తప్పదు. లేని యెడల యేవేవో కొందరికిష్తమైన శయాపద్ధతుల నభివృద్ధి పరచుట కొరకు ప్ర్రశస్తమైన విషములనే త్రోసిరాజు చేసిన నేరము వారియందు నిలచును.

గరిమెళ్ళ వ్యాసాలు