పుట:Garimellavyasalu019809mbp.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఇక శుద్ధ గ్రాంధిక భాషలో వ్రాయగలవారు అసలే శూన్యంగా వున్నారు. ఇదుగోనేను లేచానని యెవరైనా అన్నారా! 'దీనిలోని ప్రయోగాలు శుద్ధ తప్పులు, ఈ పదాలు కేవలం వాడుకలు ' అని యెవ్వరైనా చూపించవచ్చును. ప్రస్తుతం మన భాషాస్థితి ఈ రెండింటి మధ్యనాల్ ఉఱ్ఱూతలూగుచున్నది. వ్యావహారిక భాషావాదము నంగీకరించకా తప్పదు. అంగీకరిస్తే దానికి హద్దులు నెర్పరచడమూ కష్టమే. ఉన్నవి అన్న శబ్ధానికి ఉన్నాయి, ఉన్నయి, ఉన్నై మొదల్గు ప్రాంతీయాలను వాడుతున్నారు. నిలుచుండు శబ్ధానికి నిలుచొను, నిల్చొను, నించొను, నుంచొను, శబ్దములను కూడా వాడుతున్నారు. వేళకు జ్ఞాపకానికి రావు కాని ఇటివంటి ప్రయోగాలు వందలూవేలుపత్రికలలో కనబడుతున్నతి. కొన్నింటిని చూచి రమమూర్తి పంతులుగారే ఆశ్చర్యపడుతున్నరు. అయినాఏప్రాంతంలోనైనా సర్వసాధరణంగా వాడుకలో వుండే ప్రయోగాల్ని ఇతర ప్రాంతాల్లో లెవన్న కారణం చేత యెట్లా విడనాడగలము? బహుశా ఇట్లాగు రెండు మూడు శతాబ్దాలు వెళ్ళేసరికి ఇవన్నీ మనకు ప్రాతగిల్లి ఆశ్చర్యకరంగా వుండక పోవచ్చును. అంతవరకు యెవరెవరే భాషలో వ్రాస్తున్నా ఆక్షేపించడానికెవ్వరికీ అదికారంలెదు. వీనిలో కొన్ని కెవలం ప్రాంతీయములను కాదని అఖిల ప్రాంతీయములను వ్రాసేవారిని మనము కొనియాడవలసినదే. అట్లు కాదని కేవలం ప్రాంతీయాలను వాడే వారిని కూడా మన మబినందించ వలసినదే,. కలగా పులగంగా వ్రాసేవారిని కూడా మన మబినందించక తప్పదు. రాగా రాగా యేమిటితోచుచున్నదంటే జనులు వ్రాసే భాషలనుబట్టిమనమట్టే పేచీలు పెట్టుకోరాదనిన్నీ తోచుచున్నది. విషయమును బట్టి భాషయొక్క ధోరణి మారుతూనె వుంటుంచి. ఒక వ్యాసములోనే రెండు మూడు విషయములలాంటివి ఎత్తుకోవలసి వస్తుంది. అటువంటప్పుడు ధోరణి కూడా మారుతూనే వుంటుంది. ఈ వ్యాసంలోనే భాషల తత్వములు, ఆంధ్రభాష పరిమాణములు, మొదలైన విషయములను తీసుకున్నప్పుడు ప్రారంభించిన దోరణికిన్నీ, వ్యవహారిక భాషావశ్వకతను నిరూపించవలసిన ధోరణికిన్నీ యెంతో భేదము కనిపించుచున్నది. ఒకేధోరణిల్ళొ వ్యాసమంతా సాగించామంటే సాధ్యమైనదికాదు. ఈ ఒక్క వ్యాసమునే కాదు. నేనే గ్రంధమును వ్రాతామని

గరిమెళ్ళ వ్యాసాలు