పుట:Garimellavyasalu019809mbp.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నక్కరలేదు. నిజముగా జరుగుచున్నట్లనిపించిన జాలును.

    సాంఘిక నవల కవి వ్రాయుచున్న నాటి కాలముదై యుండ వలెను. మనకధ జరుగుచున్న నాటి సమయమున ప్రయోగమందెచ్చటను కానరాదు. కధ యే భాషలో వ్రాయబదుచున్నదో  ఆ భాష మాటలాడే ప్రాంతమునకును, జాతికినీ సమబంధించినదై యుండవలెను. ఒక దేశపు ప్రజలు వేఱొక దేశపు భాషను దానికి స్వతస్సిద్ధమగు జాతీఅములతొను, సులువుతోను, సౌందర్యముతోను మాటలాడజాలరు. కవి తన స్వభాషలో స్వభాష మాటలాడు వారి జీవనమును ప్రతిబింభింప చేయుటకు ప్రయత్నించిననే సాంఘిక నవల సరియైన చిత్రము కాకలదుకాని లేనియెడల సరియైనది కాజాలదు.
   కధ సత్యముగ జరుగుచున్నట్లగపించిన సాంఘిక నవల కవి కాలము నాటిదై కవి యొక్క స్వభాషలో రచితమై పాత్రలు తమ మాతృభాషను నవలలో మాటలడుచుండ వలెనని కధలో నెచ్చటను కృత్రిమ నామాదులుండరాదు. కృత్రిమ నామములనగా ఆ భాష మాటాలాడే ప్రజలు గల రాష్ట్రంములో వాడుకలో లేని స్థల నామములు, పురనామములు, పురుషనామములు మొదలగునవి. భోగవతి, మధురనగరము, ధార్మిక పురము, శ్రీ నికేతనము పేరులు మందాకిని, మస్స్యవతి మొదలగు నేఱుల పేరులు, వీరసేనుడు, విజయసింహుడు మొదలగు పురుష నామములు, సంధ్యావళి, మదాలస, మనోరమ, మొదలదు స్త్రీనామములూ ఇట్టివి మన తెలుగు దేశములో లేవు కనుక ఇట్టి పేరులను కవి సాంఘిక నవల యందు ప్రయేగించినచో అంతవరకు అవి కాల్పనికములుగా తోచి కధనంత వరకు సత్యము కానట్లు తోపజేయును. ఆంధ్రదేశపు సాంఘిక నవలను వ్రాయగడగినచో ఆంధ్రదేశములో నున్న నదులు, కొండలు, గ్రామములు, పట్టణముల పేరులును, ఆంధ్రదేశములొ వ్యవహారములో నున్న స్త్రీ, పురుష నామములను మాత్రమే ప్రయోగించవలను.
    ఇంతియ కాదు. ఈ నదులను గ్రమములను మొ॥ వానిని గూర్చి వర్ణించునపుడు గాని వాటి ప్రశంసలు వచ్చునప్పుడు గాని యే నదులకైనను గ్రామములకైనను సమానముగా వర్తించునట్టియు పురాణ
గరిమెళ్ళ వ్యాసాలు