పుట:Garimellavyasalu019809mbp.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

యెదుట ప్రవహించుచున్న కాలవాహినిని గాంచుచు అందలి విషయములను గూర్చి వ్రాసినపుడే సరియైన సత్యము చిక్కును గాని రసపుత్రయుగము నాటిదియు వంగభాష మాటాడు వంగదేశమునకు సంబందించినదియు రాయచూరు యుద్ధము వలె ఏ విజయనగ సామ్రాజ్యం నాటి ఆంధ్రులచరిత్రకో సంబంధించిన దియు నగు విషయము నెత్తుకొని వ్రాయగడంగినచో మన చర్మ చక్షువుల యెదుట జరుగు ఆకళంక సత్యమును గాక ఊహాచక్షువు నెదుట గోచరించు నట్టియు అభూతకల్పనలతో కూడినట్టియు శృంగార, వీర, శోకాద్భుతాది రసములతో మన డేందముల నానందకల్లోలినిలో నుంచునట్టియు, విచిత్రకాల్పనిక సత్యమును మాత్రమే చిత్రించినదగును. పందొమ్మిదవ శతాబ్దమున జీవించిన ధేకరియను ఆంగ్ల నవలాకారుడు పదునెనిమిదవ శతాబ్దము నాటి యొక కధను నవలా రూపుముగా వ్రాసెను. అందుకొరకా శతాబ్బపు మర్యాదలు, సంభాషణములు మొదలగునవి అద్భుత కార్యమొనర్చిన యొక ప్రజ్ఞావంతుడుగను, సాధింప సాధ్యము కాని కృత్యమును చాలవరకు సాధించిన యొక వీరునిగ మాత్రమే పరిగణించుచున్నారు కాని దానిని సంపూర్ణమగు సాంఘిక నవల యని వ్రాయుటకే విమర్శకునకు చేయిరాకున్నది.

   సాంఘిక నవల కధ యే కాలమునకు చెందినదో ఆ కాలము యొక్క సరియైన చిత్రము గ్రంధకర్తలు తరుచూ తమ కన్నుల యెదుట జరుగుచర్యలనె సరిగా చిత్రించలేక యెదో ఒక ఆబావము చేయుచుందురనిన నిర్ణయించగల తీర్పరు లెవరు? జరుగుచున్న కాలమునాటి దానికి సజీవమగు ఆ సంఘమే సాక్షి ఏ మాత్రమెచ్చుతగ్గున్నను యే యమ్మలక్కలైనను కనిపెట్టగలరు. ఇక విమర్శక విశారదుల మాట వేరే చెప్పనేల?
   కనుక సాంఘిక నవలను వ్రాయ్లబూనువాడు తన కాలము నాటియు, తనకు తెలిసినట్టియు, తాను కనిపెట్టియు జీవితాంశముల నెత్తుకొని వర్ణింపదొడగిననే సఫలీకృతుడగును. కాని 'అనగనగా నొకరాజు ' అని యే పూర్వచరిత్రనో గైకొనినచో కేవల పరిహసపాత్రుడగును. కధ జరిగి తీర
గరిమెళ్ళ వ్యాసాలు