పుట:Garimellavyasalu019809mbp.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నాయకులు కలివిగాను, వారు ఒకరి ప్రేమనొకరు చూఱకొనుటకు చేయు త్యాగములు, విలాసములు, పరిశ్రమలు మొ॥నవి విషయములుగా గలవిగాను, చాలమట్టుగ చరిత్రాత్మకములు గాను, కొంత వరకు అద్భుతములతో కూడినవిగాను నుండేడివి. అయిరొపా ఖండము ఇటాలియను సాహిత్య పరిచయము వలన బడసిన నూతన భావములతోను, ఉత్సాహములతోను ఉఱ్ఱూతలూగెడి సమయమున వివిధ దేశములలో ప్రధమమున వెలువడేడి నవలలిట్తివి గానే యుండేడివి. ఆంగ్లేయ బాషలో స్కాటు నవలలను పఠించువారికి వాటి లక్షణములు తెలియగలవు. మనదేశములో రసపుత్ర శౌర్యముగ రచిందిన విమలాదేవి, రాణి సంయుక్త మొదలగు నవలలు కూడా నిట్టివే.

    ఈ నవలలను పఠించుట వలన నవలయను పేరు మోపెడి ప్రతి గ్రంధమునకును కొన్ని పడికట్లుండుననియు, అది లేనిచో ఆ గ్రంధము నవల కాదనియు అభిప్రాయము సాహిత్య ప్రపంచమున నల్లుకొనెను. ఆపడికట్లు ఉన్నత వంశమునకు చెందిన నాయికా నాయ్హఖూళూ, వారొకరికొకరు తప్పక త్యాగము చేసి యిడుములు గుడిని తమ ప్రేమను ఋజువుపరచుట, నీతిదాయకమై నెగడుట, భాష రసోద్దీపకమై శబ్దాలంకార శోభితమై లలితమై నీతిదాయకమై నెగడులు, భాష రసోద్దీపకమై శబ్దాలంకార శోభితమై, లలితమై గంభీరమై యుండుట ఆయాతావుల కధకెంత యవసరమో అంతకు మించియు (కధనడకలో విస్తారము సంబంధము లేకపోయినను సరే) ప్రకృతి వర్ణనములు సలుపుట మొదలగునవి ఈ విశ్వాసమౌ నవలా ప్రపంచమున నొక మూర్ఖమతము వలె వ్యాపించి యీజాతి నవలలన్నియు స్థల నామములు, పురుషనామములు మత్రమే భేదముగా సమస్త దేశముల నవలలు నొక్క తీరుగా నుండునట్లు చేసినది. ప్రత్యేక స్థలముల యాచార వ్యవహారములు గాని, నిరొపణలు గాని వ్యక్తుల పోలికలు గాని చేజిక్కక యువకజనోచితములగు నుత్సాహమును మాత్రమినుమ డించుచు, అద్భుత చర్యల పఠనమున కాని గొలుపుచు వచ్చినవి. వీటిని నవలలు కావని యెవ్వరును ననజాలరు. అవియొక రీతి ననలలు సాంఘిక నవలలు కావు.
  సంఘజీవనము నందాసక్తి పుట్టి, వారి యాశలు ఆశయముల యందు
గరిమెళ్ళ వ్యాసాలు