Jump to content

పుట:Garimellavyasalu019809mbp.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అనుబంధం

(నూతన జాతీయ గీతములు - ముందుమాట)

1926లో సీతానగరం గౌతమీ ముద్రణాలయంలో మద్దూరి అన్నపూర్ణయ్యగారిచే ముద్రింపబడి, గరిమెళ్ళ సత్యనారాయణ గారిచే ప్రకటింపబడిన "నూతన జీతీయ గీతములు" (ఒకటవ భాగం) ముందుమాట

నివేదనము

ఈ పొత్తముతో మా శారదా గ్రంథమాల యొక్క నాలుగవ కుసుమమును మా చందాదారులు మొదలైన వారి కర్పించుచున్నాము. మా గ్రంథమాలలోని గ్రంథము లనేకములు ఒకటి అచ్చుపడి విక్రయమయేటప్పటికి వేరొకటి తొందరగా వ్రాసి అచ్చొత్తించి పాఠకుల చేతులలోఁ బెట్టెడి నవీన నాగరీక కాఫీ హోటలులోని వేడి వేడి పెసరట్లవంటివి కావు. చిరకాలము క్రిందట వ్రాయబడి అచ్చుకాకముందే అనేక పాఠక విమర్శక శిఖామణుల చెవులకెక్కినుతులు గొని ముద్రణార్హములని యెన్నఁబడియు, ద్రవ్యాది సాధన లోపముల ఆలస్యముగ కాని ఆంధ్ర నేత్రముల నానందింపజేయజాలని పేదరత్నములు.


ఈ పాటల తాలూకు వరసలు కష్టములు కావు కాని నవీనములు. వీనిని నా ముఖతా యొకసారి వినినచో సులభ గ్రాహ్యము అగుటయే కాక ఆనందదాయకములని కూడ ఆంధ్రులు తలంపకపోరు. ఇదివరలో నాలుగేండ్ల క్రిందట నేను జాతీయగీతములు వ్రాయుటయు ప్రభుత్వము వారి కవి కంటరొక్కసమయమగుటయు నాకు దీర్ఘకారాగారశిక్ష నొసంగుటయు ఆంధ్రులు మఱిచియుండరు. నేను జయిలునుండి వచ్చినప్పటినుండియు ఆంధ్రులెల్లరు నన్ను జాతీయగీతములను పాడుమనుచుండుటయు, నాపూర్వపు పాటలు నిషిద్ధములగుటచే నేనవి పాడుటకు అనుకామియు దేశకాల పరిస్థితులు మారుటచే ఇప్పుడప్పటి పాటలు కాక క్రొత్త పద్దతులతో క్రొత్త సందేశములతో పాటలు వ్రాయవలసి వచ్చుటయు నన్నీ గ్రంథమును ప్రచురించుటకుఁ బురికొల్పినవి.

174

గరిమెళ్ళ వ్యాసాలు