పుట:Garimellavyasalu019809mbp.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అందరికీ తన్నుమాలిన ధర్మమేమిటనే యేకైక వింత పట్టుకొన్నది.లోక కళ్యాణం కంటే స్వీయ కళ్యాణం యెక్కువ ప్రధాన మనుభావము పాదుకొనివున్నది. ఎవరిని తప్పు పడదామన్నా ప్రతీ వ్యక్తిలోనూ యేదో ఒక లొసుగు ఉంటునే వున్నది. లోకంలో కపట శాంతిని నిలబెట్టి ఈ కపడ నాటకమును సాగించడం కోసమే నేటి సంస్ధలన్నీ తోడుపడుచున్నవి క్రొత్తవి నిర్మించుచున్నవి.

 కనుకనే నిర్గందకుసుమాల కున్న గౌరవం సురబిళ పుష్పాలకు లేక పోతున్నది. సురభిళ పుష్పాలన్నీయేయరణ్యములోనో ప్రతి ఉదయమునను పూచి ఆఘ్రాణించే దాతలు లేక సాయంకాలము వరకు రాలిపోవుచున్నవి.
   అధవా యీ లోకంలోకి వచ్చి కాస్త సువాసన విరజిల్ల ప్రారంభించే టప్పటికి మామూలు నేరగాళ్ళలాగే బందిఖానాలలో బంధింపబడుచున్నవి. ఇదంతా ప్రజారక్షక  శాంతి పోషక ప్రభుత్వ చట్టాల విశాలశ్లేషణల క్రింద జరుగుచున్న మహాతంతుగా పరిణమించుచున్నది. ఇదే ధర్మమై నేడు లోకమును ప్రభుత్వ విధానములను ధరించుచున్నది. ఇదికూడాకూలిపోతే ఈమాత్రం ప్రపంచమైనా నిలువదను భయము ప్రతీ పెద్దను ఆవరించి యున్నది. ఇట్టి ప్రపంచం కూలిపోతే సృష్టికి వచ్చే ముప్పేమిటో యెవ్వరును చెప్పజాలకున్నాదు.
  అయినా సృష్టి మహా చిత్రమైనది. నిలబడమని మనము కోరితే నిలిచేది కాదు. కూలమని శాసిస్తే కూలేది కాదు. ప్రకృతి దేవత మహాబలీయమైనది. దానికి జ్ఞానం లేదని, మానవుడేట్లు నలిపి పాడుచేస్తే అట్లల్లా విజ్ఞానం కతీతమైన మహప్రజ్ఞలు  దానికున్నవి. ఇవతల మనము విజ్ఞాన డోలికలలో అంబరువీధిలో ఊగుతూ వుండగానే  అది మనను అధ:పాతాళములోనికి త్రోయగలదు.
    ఒక్కొక్క వేళావిశేషంలో ఈశ్వరుని సహిత్ము మాయ గ్రమ్మి లోబరచుకొనగల మహాశక్తి ఈ ప్రకృతికి ఉన్నప్పటికి రేఖ మారినప్పుడది యీశ్వరుని శాసనమునకు లొంగి పాదాక్రాంతు రాలు  కావలసినదే