పుట:Garimellavyasalu019809mbp.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గొడ్డలిపెట్టులు కనుక అట్టి విశాలతత్వ వాసనలను రూపుమాపే పై వర్గలందరియొక్క సమానాశయం వారి ధర్మమంటూ జన సామాన్యంలో కూడా దేశాభిమానము మొదలగు ఉత్తమాశయముల యందు కంటే స్వార్ధపరాయణత్వమున కగ్రతరస్థానం లభించినది. కనుక వారి మాటలు పద్యములైనట్లు ఇతని విశాలాశయముల మాటలు పధ్యములు కావు.

      ఈరకం మూకల గూడుపుఠాణీల ద్వారానే నేటి నాయకులు పైకి తేలుతూ వివిధస్వార్థ సాధకమైన ఈ ప్రజా పరిపాలనా తంత్రమును "జయప్రదముగా" సాగించుకొని పోవుచున్నారు. కాని ఈ గూడుపుఠాణీ లన్నిటినీ కీలక పరిశ్రమ ధనాశా పరాయణత్వమే కనుక దానిలో ధర్మవాసన లేశమైనా లేదు.  కనుక నేటి సంఘమయినా లోలోన నగ్నిచే కుములుచున్న అగ్ని పర్వతముతొ తుల్యమై యున్నది.
  అది ప్రేలనె ప్రేలకూడదు కాని ప్రేలినా యెన్నో దుష్ట సంస్ధలతో పాటు, వాటికంటే ముందుగా కూడానేమో, అనేక సత్సంస్థలు కూడా దగ్ధమగును. కాని ఆ పరిస్థితి తప్పని సరియగు నేమో అని భయమగుచున్నది. అది తప్పుట కొక్క మార్గమున్నది కాయా, మనసా వాచా జనులందరూ డబ్బుకోసం కాక ధర్మం కోసం పంటలు పండించుచున్నామనీ, ఉద్యోగాలు చేస్తున్నామనీ, తీర్పులు చెపుతున్నామని, పాఠాలు బోదిస్తున్నామని, చదువులు చదువుతున్నామనీ, దివ్యస్వప్నములు కంటూ తదనుకూలముగా వర్చించడం నేర్చుకోవాలి. ఇప్పటి స్థితిలొ ఈ తత్వం, మానవలోకం మాట అటుంచి, భారతీయ విద్యల్లోక మనబడే వారికైనా తల్కెక్కడం కష్టం.
       డబ్బుమీద శ్రద్ధ తగ్గించి లోకహితంమీద దృష్టి నిగిడించమంటే, బిర్లాకెంతకోపమో, ఫ్యాక్టరీ కార్మికునకు అంతకంటే యెక్కున కోపం. హైకోర్టు జడ్జికి జిల్లా కలెక్టరుకు యెంత కోపమో తపాలా బంట్రోతుకు అంతే కోపం జవహర్లాలు కెంత కోపమో రాజాజీ, పటేలు, మత్తయి, అజాద్ లకు కూడా అంతే కోపం
      డబ్బాస లేకుంటే మానవ ప్రకృతి చిన్న మెత్తు పని చేయడమ
  గరిమెళ్ళ వ్యాసాలు