పుట:Garimellavyasalu019809mbp.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వాణిజ్యం * ఆరాచకం * విరుగుడు

  మనకు స్వాతంత్యం వచ్చి సంవత్సరము గడచినది. కాని కరువు కాటకాలెమీ తగ్గలెదు. మరియు ధరలు దిన దిన ప్రవర్ధమానమగు చున్నవి. ఏవృత్తిలో నైనా నిలకడగ యెంత సంపాదించుకున్నా నిముషములొ హరించిపోవుచున్నది. వర్తకం చేసుకొని దొంగలాభాలు కట్టుకొనే వారికి తప్ప యెవరికీ యేమి మిగలకున్నది. ఏవోమోసపు మాటలు చెప్పి ఇతరుల వద్దగల ధనమును దోచేవారికి తప్ప నిజముగా కష్టపడేవారికి రోజు గడియకున్నది.
  అందరూ అందలము నెక్కేవారే అయితే మోసేదెవరు? అందరూ వర్తకులైతే కొనుక్కునెవారెవరు? అందరికె వర్తకము సాగించే మెళుకువలు, టప్పాలు కొట్టి ధనము తీయగల అవకాశములు లభించునా? అట్లు లభించే అవకాశము పూర్వము నూటికి పది మందికి కలిగితే ఇపుడు మహా అయితే నూటికి ఇరువది మందికి కలుగుచున్నదనుకోవచ్చును. తక్కిన యెనభైమంది పొట్టలను ఈ యిరవిఅ మంది కొట్టి బాగుపడుచున్నాదు.
  ఈ కాటకమున కంతటికినికారణమేమిటి? సరుకులు తక్కువై నందువల్ల ఖరీదులు హెచ్చుచున్నవా? ఖరీదులు హెచ్చుటకొరకు వస్తువులు కనపడకుండుటయు, చివుకుటయు, కుళ్ళుటయు, తప్పనిసరియైనప్పుడు మాత్రమే సరుకు కనబాడుచున్నదా?
  వీరిలో యే దుకాణములను చూచిన మునుపటి ధాన్యరాసులకు బట్టల మోపులకు, కూరలపోగులకు, దినుసుల తిప్పలకు తక్కువగా లేవు గ్రామాలలోని సంతలను చూచినా యీ విధముగానే ఉన్నవని అనుకోవచ్చును.
   మునుపటి కంటే సరుకే మాత్రము తగ్గలేదు. ఆమాత్ర మీసూత్రము
గరిమెళ్ళ వ్యాసాలు