పుట:Garimellavyasalu019809mbp.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వుంచడం చాలా అవసరం.

  మునుపటి రాజుల కళాపోషణ భాషాపోషణా యుగంలో లాగా, ఇప్పటి సంకుచిత భాషావాద డెమోక్రసీ నాయకులు తమ రాష్ట్రములో తమభాషకు తమ సంగీతానికి, తమ "సంస్కృతికో తప్ప ఇతర విదానాలకు దొహదమిస్తారేమో చెప్పజాలము. అట్లు ఇయ్యనన్నాళ్లు భారతీయ సంస్కృతికి ద్రోహం చేసిన వారే అవుతారు. నాయకులెట్లు వర్తించ్నా వివేకధురీమణులగు పండితులు పామరులైనా తెలివిగా వర్తించి తమ సనాతన సంప్రదాయమును మవువక తమ భాషను, సంగీత్మును కళలను ఉద్దరించుకోవడంతోబాటు ఇతర భాషలో సంగీతంలో నాట్య్హంలో నాటక  విధానాలలో కవితా ధోరణులలో యెట్టి ఫక్కీలు సాగుచున్నవో గమనించి అవగాహన చేసుకొని తమ ప్రాంతములలో వాటిని ప్రచారం చేయబూనారా, అది నిజమైన భారతీయ సంస్కృతికి దోహదమవుతుంది. లేకుంటే కూపస్థ మండూకమై చలనం లేక గడ్డ కట్టిపోతుంది.
   అట్టి అవస్థరాకుండా తప్పించడానికి మిశ్రమ భాషా రాష్త్ర నిర్మాణం అత్యంతావశ్యకం. సరిహద్దు ప్రాంతాలలో అట్టి రాష్ట్రేఅలను నిర్మించడం సులభం. అవ్బసరం, అభ్యుదయం దోహదకరం సంకుచిత భాషావాదుల మూఢత్వము నరికట్టగలవి అట్టి మిశ్రమ రాష్ట్రాలే.
  ఈవిషయమును నెను క్రొత్తగా ప్రతిపాడించలేదు. కొంత కాలం క్రిందట Andhra Herald లో (Bilingual provinces are the connective links of Indian Culture) అను వ్యాసమును ఆంగ్ల భాషలో వ్రాసితిని. ఆ భావముల నింకోరీతిని ఉటంకించవలశీణా అవసరం యేర్పడినది కనుక ఈ వ్యాసమును వ్రాయుచున్నాను.
మద్రాసు మిశ్రమ రాష్ట్రం
  ఆంధ్రరాష్ట్ర నిర్మాణమునకు మద్రాసు నగర సమస్య ప్రధానమగు చిక్కుగా భావించుచున్నది గనుక, ఈ విషయమును తిరిగి ఉద్ఘాటించవలసి వచ్చింది. శ్రీ పట్టాభి సీతారామయ్య గారు ఆంధ్రులు మద్రాసు నగరంపై "తమకు గల హక్కులను" వర్జింపలెనని కోరినారు. ఆ పదజాలమును
గరిమెళ్ళ వ్యాసాలు