పుట:Garimellavyasalu019809mbp.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఈ విధంగా పాలకులు పండితులు చేసిన భారతీయ సంస్కృతి దోహదమునకు తోడు ప్రజాసామాన్యము కూడా తమంతట తామే ఒక భాషా ప్రాంతంలోని విధానమును ఇంకో ప్రాంతంలోకి అనుకరించే వారు. యక్షగానము, తోలుబొమ్మలాట, భామకలాపం, భట్రేఅజు కవిత్వం మొదలగునవన్నీ ఇంచుమించుగా దక్షిణ భారతీయ ప్రాంతము లన్నిటిలో సరిసమానముగా వర్దిల్లినవి. మహారాష్ట్ర నాటక కంపెనీల దక్షిణ దేశ యాత్రేవల్ల దక్షిణాది నాటకరంగమే భామకలాప యక్షగానములకు విభిన్నమైన ఒకనూతన ఫక్కీకి వచ్చిందని ప్రేక్షకులకు తెలుసును.

  ఇదంతా యెందుకు చెప్పవలసి వచ్చిందంటే, ఏ భాషవారైనా ఆ భాష ఒక్కటే తమ సొత్తు, తక్కిన భాషలు తమ శత్రువులు అను భావముతో వర్తించలేదని తెలుపుటకే ఇన్నిటికిని తెలుగు వరపంచాలలో తెలుగు నెలలు, ఇంగ్లీషు నెలలు, అరవ నెలలు, తురక నెలల పేర్లు పిల్లలకు పాఠము చెప్పబడుచున్నది. శ్రీకాకుళం జిల్లా గ్రామాలలో యెక్కాలు తెలుగులోను ఉత్కళ బాషలోను కూడా చాలాకాలం వరకు చెప్పబడుచుండేను. 11.11.121 మొదలు 20.20.400 వరకు గల యెక్కాల భాగమునకు ఇప్పటి కీని "యెగరన్నగిరీలు" పేరే ఆ ప్రాంతాలకు గల ఉత్కళ సంపర్కాభి మానమును తెలుపుచున్నది. అసలు "ఎక్కము" అను శబ్దమే ఓడ్రభాషాతద్బవం ఓడ్రంలో "యెక్కా" తెలుగులో యెక్కమైనది. ఓడ్ర ప్రాంతములకు దూరమైన్ తెలుగు బాగాలలో వానిని 'ఒంట్లు 'అంటారు. ఒక బాలుదు పెద్దవాడైతే కెవలం తన ప్రాంతాలలోనే కాలం వెళ్ళ బుచ్చవలసినవాడు కాదనీ, దేశంలో వివిధ ప్రాంతాలకెప్పుడో ఒకప్పుడేదో కర్యం మీద వెళ్ళవల్సి వచ్చేవాడు కాబోవుచున్నాడనీ, అందుకు తగిన పరిజ్ఞానమును కొంతైనా బడి చదువులలో నేర్పాలని ఆనాటి జనుల అభిప్రాయమని విశదమగుచున్నది.
     ఇట్లు సమగ్ర పరస్పరాబిమానతుందిల భారతీయ సంస్కృతీ రంగంలోకి బ్రిటిషు కృత్రిమ రాజనీతిజ్ఞడు విషభీజములను విరజిమ్మగలిగారు. ఉద్యోగ సద్యోగాదులలో ఒక వర్గం వారి యెడ పక్షపాతం బూని ఇంకొక వర్గం వారిని అణగదొక్కించడం, ఒక ప్రాంతములోని ఆదాయమును తీసి ఆప్రాంతమును పస్తు బెట్టి రెండవ ప్రాంతంలో అభ్యుదయ ప్రాజెక్టులు నిర్మించడం మొదలైన చర్యల ద్వారా పరస్పరద్వేషాలను పురికొల్పాడు.
గరిమెళ్ళ వ్యాసాలు