పుట:Garimellavyasalu019809mbp.pdf/141

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అలగ్జాండరు దండయాత్ర తదనంతర చరిత్రల ఫలమనడానికి సందేహం లేదు.

  అట్లే బౌద్ధులు మొదలగు ధర్మ మత ప్రచారసక్తులు భారతదేశము నుంచి చీనా, బర్మా, సింహళం, జావా మొదలగు ప్రాంతాలకు వెళ్ళి అచ్చటి ప్రజల అభభిమానాలను జూఱగొని వారికి భారతీయ సంసృతి పరిచయము నొనర్చిరి. నాటినుండి ఆయా దేశాల్ విద్వాంసులను భారతీయ ప్రతిభను కనులార చూడగోరి విచ్చేసి సత్కారమును పొందేవారు. జాతులకు జాతులకు మధ్య సంస్కృతులలో యేవో బ్రహాండ భేదములున్నందునను మాట కల్ల. చీనాలోని కన్ఫూషియస్ సిద్దాంతములకును బౌద్ధసిద్దాంతములకును యెంతో సన్నిహితమగు పోలికలుండబట్టే, చీనా మొదలగు దేశాల ప్రజలు సునాయాసంగా బౌద్ధమతంలో చేరడం సంభవించించి కాని, నిర్భంధం, పేరాసల వల్ల కాదు.
    తరువత హిందూ వేదాంత తత్వప్రచారకులు తమ కళా నైపుణీ చాతుర్యముతో రామాయణ మహాభారతాది సాహిత్య చోదిత సౌందర్య ప్రసారముతో ఆయా దేశాలకు వెళ్ళినప్పుడు, బౌద్ధమత సిద్దాంతాలను వలె భారతీయ కళలను కూడా వారు సులువుగా అవలంభించారు. మన దేశంలో చిత్ర్రాలే, దేవళములలాటి దేవళాలే, సాహిత్యం లాటి సాహిత్యాలే ఆ దేశాలలో వెలసి నేటికి ఉదాహఱణగా నిలచి ఉనవంటే మన పూర్వులు వాటిని వారిపై నిర్భందించిరని అర్ధం కాదు. ఆయా దేశాల ప్రజల లక్షణాలును ఈ దేశ ప్రజల లక్షణాలను ఇంచుమించు ఒకె పోలిక కలవగుటవల్లనే అట్టి కలాసమ్మేళనములును జరిగినవి.
మత ప్రచారాలు, ద్వేష, ప్రభోధాలు
 ధర్మిలాను మనదేశంలో అనెకులు మహమ్మదీయ, క్రైస్తవ మతములలో చేరిన సందర్భములను కూడా మనమాలోచించ వచ్చును. ఈ మతాల ప్రచారం నాటికి మతప్రచారమనేది ఒక మోస్తరు పిచ్చి ఆవేశం క్రిందికి మారింది. మహమ్మదీయులు కాని వారినందరిని వారు కాపర్లనీ, వారికి మోక్షం లేదని, బలవంతంగానైనా చేర్చుకొవడం దోషం కాదనీ భావించారు. కనుక అనెకులు నిర్బంధంగానే ఆ మతంలో చేరారు. అట్లే కైస్తవులు కానివారినందరిని