Jump to content

పుట:Ganapeswaralayam - K. Srinivasa Rao.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చెరువు గట్టున గంగాదేవి ఆలయం, వీరగల్లు పూజ

గంగామాత ఆలయంగా ఇప్పటికీ ప్రజలు కొలుస్తున్న ఒక ఆలయం గణపేశ్వరాలయానికి దగ్గరలో గంగాదేవి చెరువు గట్టుపై వుంది. ఈ ఆలయం పక్కనే నిలబెట్టిన మూడు వీరగల్లు

లున్నాయి. వీరగల్లు అంటే ఒక్కప్పటి స్థానిక వీరుల స్మారక శిలావిగ్రహరూప శాసనాలు. అప్పటి చరిత్రను అర్ధం చేసుకోవడానికి ఇవి ప్రధానమైన ఆధారాలు.

యుద్ధాల్లో మరణించిన వీరుల జ్ఞాపకార్థం గ్రామాల పొలిమేరల్లో ప్రతిష్టించిన ఇటువంటి రాళ్లు రాష్ట్రమంతటా గ్రామ గ్రామంలో దొరికాయి. మరణించిన తరువాత కూడా ఆ వీరులు భైరవ, వీరభద్ర రూపాల్లో గ్రామాలని రక్షిస్తారని గ్రామస్థులు నమ్మి, వాళ్లకు ఊరిబయట గుళ్లు కట్టి పూజలూ, బలులూ ఇచ్చే ఆచారం చాలాచోట్ల ఈనాటికీ ఉంది. ఆ రాళ్ళపై వాళ్ల వీర కృత్యాలు, యుద్ధంలో ఘట్టాలు బొమ్మలుగా చెక్కి, వాళ్ళు చేసిన సాహసాల గురించి రాసారు. వీరగల్లు శాసనాలు ఆనాటి పరిస్థితులకి అద్దం పడతాయి. చిన్నచిన్న రాజ్యాలు, నలువైపులా శత్రువులు, అలివిమాలిన పన్నుల భారం, యుద్ధాలు, దోపిడీలు, పశువుల మందలపై దాడులు, సామాన్య ప్రజలకి రక్షణలేని కాలం కొన్నాళ్ళు నడిచింది. మధ్యయుగంలో భారతదేశంలోనే గాక ప్రపంచమంతా భుక్తి కోసం యుద్ధం చేసే మెర్సినరీ

రీ