పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/248

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ప్రెంచిస్వాతంత్ర్యవిజయము

పదునాఱవ అధ్యాయము

అతివాదులు

1

యూరపు వారి
శతృమండలి

లూయీ రాజు మరణించిన తరువాత ఫ్రాన్సు దేశము యొక్క కష్టము లంతరించ లేదు. జాతీయసభలో గిరాండిస్టుల కును అతివాదులకును సుధ్య తగాదాలు హెచ్చినవి గాని తగ్గ లేదు. యూరోపులోని శత్రుమండలి యొక్క పట్టుదల ద్విగుణీకృతమయ్యేను. ఆగష్టు 10 వ తేదీన లూయిని రాజ్యభ్రష్టుని చేసినప్పటి సుండియు సంగ్లాండు ప్రభుత్వమువారు ఫ్రెంచిచి రాయ బారిని వెడల గొట్టిరి. నూతన ప్రభుత్వము నంగీకరించనని ఆంగ్లేయ ప్రథానమంత్రి , విలియంపిట్టు చెప్పెను. ఫ్రెంచి జాతీయసభ వారు 1793 వ సంవత్సరము ఫిబ్రవరి 1 వ, తేదీన 'బెల్జియముసు కలుపుకొని ఇంగ్లాండు విూద - యుద్ధమును ప్రక