పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
142

ఫ్రెంచి స్వాతంత్య విజయము

త్వమువారుగాని ప్రజ లేర్పఱచుకొనగ వచ్చినవారు. ప్రజలలాభ మునకై ఏర్పడిన వారు. ప్రజలకు నేనౌకరలు. తమ్మును తాము పాలించుకొన హక్కు ప్రజలది. ప్రజల చిత్తమే. చట్టము. ఏప్రభుత్వమునందు ఎప్పుడు ప్రజల కష్టము లేక పోయి నను; ఆప్రభుత్వమును కూలదోసి తమ యిచ్చవచ్చిన ప్రభుత్వమును. ప్రజలు స్థాపించు కొనవచ్చును." అను నది ఆయన వ్రాసిన 'రాజకీయతత్వము ప్రభుత్వమును ప్రజల యిష్టము నకు వ్యతి రేకముగ ప్రవర్తించుటకు హక్కు లేదు. ప్రజల'స్వాతంత్యమును పాడు చేయుటకు అర్హత లేదు. స్వాతం త్యము ప్రజల సహజధర్మము, ప్రజల స్వతంత్రతను కాపా డుకోనుటకును: ప్రజల చిత్తముసకు లోబడి నడుచుకొనుటకును ప్రథమమున యొడంబడిక జరిగి ప్రజలు ప్రభుత్వముల నేర్పర చుకొన్నారు. కాల క్రమమున రాజులును ప్రభువులును ఇతర ప్రభుత్వము లును: మొదటి యొడంబడికకు భిన్నముగ ప్రజల స్వతంత్రతను హరించి ప్రజలను దాసులను చేసికొని, నిరంకు శత్వమును స్థాపించి యున్నారు. ప్రజలు తమహక్కులనుగూర్చి మరిచిపోయి 'బాధలకు లోనయి నారు.తిరిగి స్వతంత్రతను సంపాదించుకొనుట ప్రజలవిధియై యున్నది. దేశములోని ప్రజలందరును ఒకేజాతి. ఎక్కువ తక్కువలు లేవు. అందరికిని దేశాభిమానమును తిరిగి బోధించవలెను. దేశాభిమానము స్వభావసిద్ధమయినది. దానిని ప్రజలు ప్రభుత్వముల యెత్తడి క్రిందను, ప్రభుత్వములు చూపించు తప్పుడుత్రోవలలో ప డియు మరచిపోయినారు. దేశములోని ఎక్కువ సంఖ్యాకుల