పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

138 .

ఫ్రెంచి స్వాతంత్ర్యవిజయము

తరువాత రెండు నెలలకే యూ పండితోత్తముడు ప్యారిసు సగర మున చనిపోయను. ఆయన శవమును సమాధి చేయుటకు రోమ, నుకాథలిక్కు మతగురువులు రాలేదు. ఆయన మేనల్లుడగు నొక మతగురువు రహస్యముగా నాయన కళేబరమును, గొనిపోయి తమయాజమాన్యము క్రిందవున్న దేవాలయపు దొడ్డిలో పాతి పెట్టెను.ఇందునకై యామతగురువు తన యుద్యోగమును గోల్ఫోయెను. మతస్వేచ్ఛను. బోధించినందులకై ఆయనశవ ము మీద మతగురుపులు తీర్చుకొనిన కసి ఇది:


పెంచి విప్లవమునకందరికన్న నధిక కారకుడగు రూసో 1712 వ సంవత్సరమున జన్మించెను. అతడు స్విడ్జర్లాండు లోని

రూసో

జినీవాపట్టణమందలి గడి యారములు తయారు చేయునొక కార్మిరుని కుమారుడు . చిన్న తనమున దిన్నగ చదువుకొనక , ఏపనీయు నేర్చుకొనక కాలము చెడు సాంగత్యములతో దేశద్రిమ్మరిగా నుండెను ఆయన జీవిత మంతయు కడు పే రికమున గడిచెను..ఆరోగ్యము కూడ సరుగ లేక అనేక కష్టములకు లోనగుచు, సంతోషమనునది యెరుంగక మనోవ్యాకులము : కలిగియుండెను. అప్పుడప్పుడాత్మహత్య గావించుకొన దలచుచు వచ్చెను. కాని, యెవరిని కూడ లక్ష్య పెట్టక అత్యధిక మగు ఆత్మగౌరవము కలిగియును. ప్రభు వైసను, మరి యే యితరులైనసు సహాయము చేయ యత్నించినచో దానిని తిరస్కరించు చుండెను. అవసరములను తగ్గించుకొని తాను కష్టపడి సంపాదించుకొనిన దానితో మాత్రమే ఆయన జీవించెను. తన పిల్లల నయిదుగురిని అనాధశర