పుట:February 2020.అమ్మనుడి.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దొరకాల్సిన అవకాశాలు. ఈ రోజు ఆమె ఉండివుంటే ఆమెకు ఎన్ని పురస్కారాలు దొరికేవో? ఆ యల్లమ్మకే తెలుసు. ఆమెది అద్భుతమైన కంఠ స్వరం. ఎన్ని వేల నాటకాలు వేసిందో ! ఒక్కొక్క ఊళ్ళో రోజుకు కనీసం నాలుగైదు సార్లు నాటకం వేసింది. పల్లెవాళ్ళు ఈ రోజు ఈ వీధిలో నాటకం ఆడిస్తే, మరుసటి రోజు మరో వీధిలో నాటకం వేయించేవాళ్ళు. ఆమె యల్లమ్మ పాత్ర చేసేది. ఆమెతో కనీసం 25 మంది పరశురాముడి పాత్రలు వేశారు.

ఆమె కంఠం ముందు వాయిద్యాలు ఓడిపోయేవి. అంటే ఆమె పాడుతున్నప్పుడు దూరంలోని జనాలకు వాయిద్యాల సద్దు వినిపించేది కాదట. వలకళ్ళి (ఇప్పుడు ఆ ఊరును కొండాపుర అంటారు) గ్రామంలో నాటకం వేస్తే మల్లాపుర గ్రామ ప్రజలకు వినిపించేదట. ఒకటిన్నర కిలోమీటరు దూరానికి కూడా వినిపించే కంఠం ఆమెది. పాటలను అవలీలగా పాడేది. ఇలా కథలు చెప్పి, నాటకాలు వేసి జోగమ్మలకు సమాజంలో ఒక స్టానాన్ని సృష్టించి పోయింది. ఈ నాటకానికి అభిమానులను తెచ్చిపెట్టింది. ఈ రోజు మేము కూర్చుని ఇలా భోజనం చేస్తున్నామంటే ఆమె చేసి పెట్టిన వంట అనుకోవాలి. మా కోసమే ఆమె కట్టిపెట్టిపోయిన బత్తి. దాన్ని మేము తింటున్నాం. నేనూ తింటున్నాను.

అయితే ఆమె కలను సాకారం చేస్తున్నాననే సంతృప్తి నాకు ఉంది.

ఈ విషయాన్ని నేను చెప్పడంకన్నా ఎక్కువగా జనం చెప్పాలి.

ఆమె స్థాపించిన బృందంలో (శమిస్తూ, జోగిని నృత్యాన్ని ప్రదర్శిస్తూ, మంచి కార్యక్రమాలు చేస్తూ జీవితాన్ని గడుపుతున్నాను.

మాతో నాటకం వేస్తే అపశకునమట !

ఇప్పుడు ప్రభుత్వం మమ్మల్ని 'మంగళ ముఖిలని పిలుస్తోంది.

మా దృష్టిలో అది మంచి పేరు.

ఆ పేరు వాడుకలోకి వచ్చిన తరువాత మా జీవితాలు కూడా మంగళకరమవుతూ పోయాయి.

సమాజంలో మమ్మల్ని చూసే దృష్టి కొద్దిస్థాయిలో మారింది.

కళా ప్రదర్శనకు అవకాశాలు పెరిగాయి.

మరియమ్మనహళ్ళి నాటకరంగ కళాకారులు “ప్రభుత్వమే వీళ్ళను (జోగమ్మలను, తృతీయలింగులను) మంగళముఖిలుగా గుర్తించింది. వీళ్ళను చేర్చుకుని మేమేందుకు నాటకం వేయకూడదు” అని మాతో కలిసి, మమ్మల్ని తమ బృందంలో చేర్చుకుని నాటకం వేశారు.

“మోహిని భస్మాసుర అనే నాటకంలో నేను భస్మాసురుడిగా, గౌరమ్మ జోగమ్మ దేవేంద్రుడిగా, రామవ్వ జోగమ్మ బ్రహ్మదేవుడిగా అభినయించాం. శ్రీమతి ఇళకల్లు ఉమారాణి, శ్రీమతి నాగరత్నమ్మ మాతో కలిసి నటించారు. ఇలాంటి మార్పులకు నాగరత్నమ్మే ప్రముఖ కారకురాలు.

ఆ రోజు మా అందరికి చాలా సంతోషం కలిగింది. ఎందుకంటే గొల్లరహళ్ళిలో ప్రతి సంవత్సరం దేవీ జాతర జరుగుతుంది. ఆ జాతరలో నాటకం వేసే పరంపర కొనసాగుతూ వస్తోంది. ఆ నాటకంలో నాకు నటించాలన్న కోరిక కలిగింది. అందువల్ల ఒకసారి ఊరివాళ్ళను అడిగాను. ఊరివాళ్ళు కూడా అంగీకరించారు. నా దగ్గర నాటకానికి ఇవ్వడానికి డబ్బులు లేవని చెప్పాను. అప్పుడు ఊరిప్రజల్లో 'మంజమ్మ పాత్ర వేస్తుందంటే నేను దబ్బు ఇస్తాను, నేను డబ్బు ఇస్తాను అని నలుగురైదుగురు ముందుకు వచ్చారు. “'మంజమ్మకు కిరీటం పెట్టి పదిచేతులు పెడితే దేవతలా కనిపిస్తుంది. అలాంటి సన్నివేశాన్ని చూసి మనం సంతోషించాలి” అని అన్నారు. అప్పుడు నాకు కలిగిన సంతోషాన్ని వివరించడానికి నాకు మాటలు దొరకటం లేదు.

అ ఉత్సాహంతో డైలాగులను కంఠస్థం చేయడం ఆరంభించాను. ఖిక్షానికి వెళ్ళినా చౌడికెలో నాటకం పుస్తకం పెట్టుకుని వెళ్ళి సమయం దొరికినప్పుడల్లా కంఠోపాఠం చేశాను. సంతలలోనూ తిరుగుతూ డైలాగులను మననం చేసుకుంటున్నాను. అంత ఉత్సాహంతో నేర్చుకున్నాను.

జాతర దగ్గర పడుతుండగా నలుగురైదుగురు గ్రామపెద్దలు నా దగ్గరికి వచ్చిమగజోగమ్మలు మా నాటకంలో నటించకూడదు” అని అన్నారు. “ఎందుకు?” అని అడిగాను.

అప్పుడు, “మగజోగమ్మలతో నాటకం వేస్తే అపళకునం అంట. అంతేకాకుండా పక్మనున్నపల్లెలవాళ్ళు,'ఊళ్ళో మగవాళ్ళు లేరా? మగజోగమ్మల చేత పాత్ర వేయిస్తున్నారుకదా, మీరు మగవాళ్ళు కాదా?” అని అడుగుతున్నారట. అందువల్ల ఊరి కుర్రవాళ్ళు మీ చేత పాత్ర చేయించవద్దంటే వద్దని అంటున్నారు. కాబట్టి నువ్వు నాటకంలో నటించకు” అన్నారు.

ఆ రోజు నాకు చాలా అవమానంగా అనిపించింది. ఉన్న ఊరిలో ఇలాంటి అవమానాన్ని నేను ఎన్నడూ అనుభవించలేదు.


(..తరువాయి 48 వ పుటలో ) | తెలుగుజాతి పత్రిక జవ్ముసుడి. ఆ ఫిబ్రవరి -2020 |