18
దంపూరు నరసయ్య
భావాలు వ్యక్తంచేస్తూ వచ్చారు.
1858లో మద్రాసు, కలకత్తా, బొంబాయి విశ్వవిద్యాలయాలు ఆరంభమయ్యాయి. పాశ్చాత్య విద్యను ఇంగ్లీషుమాధ్యమంలో బోధించడం ప్రారంభమయింది. ఇంగ్లీషు విద్యావ్యాప్తి, పాశ్చాత్యుల సంసర్గం, సంస్కరణభావాలకు స్ఫూర్తినిచ్చాయి. ప్రజాభిప్రాయాన్ని తీర్చిదిద్దడంలో పత్రికలు తమవంతు కర్తవ్యాన్ని నిర్వహించాయి. మద్రాసు వేదసమాజ ప్రభావంవల్ల బాలికావిద్య ప్రచారంలోకి వచ్చింది. పురుషులు ఉపాధ్యాయులుగా ఉండడంవల్ల తల్లిదండ్రులు బాలికలను బడులకు పంపడానికి ఇష్టపడని రోజుల్లో, 1866లో మేరీ కార్పెంటర్ (Mary Carpenter), మద్రాసు వచ్చి, స్త్రీ విద్యకు అనుకూలంగా ప్రజాభిప్రాయాన్ని మలచడానికి కృషిచేసింది. పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ డైరెక్టరు పావెల్ చొరవతో స్త్రీలకోసం ప్రత్యేకంగా నార్మల్ స్కూలు (Female Normal School - ఉపాధ్యాయ శిక్షణ పాఠశాల) అవసరాన్ని ఆమె మద్రాసు హిందూ సమాజానికి నచ్చచెప్పింది. రంగనాథశాస్త్రి, రామయ్యంగారు ఆమె అభిప్రాయాలను సమర్థించారు. ప్రభుత్వం స్త్రీలకోసం ప్రత్యేకంగా నార్మల్ స్కూలు ప్రారంభించింది.