పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

100

దంపూరు నరసయ్య


మీ బాధ్యతను గుర్తించి సక్రమంగా నిర్వర్తించి సహకరించమని అర్థించే ఈ సేవకుడు, డి. నరసయ్య, ప్రొప్రైటర్, పీపుల్స్ ఫ్రెండ్.”

సుబ్రహ్మణ్య అయ్యరుకు వీడ్కోలు

నరసయ్య రాజకీయ అభిప్రాయాలను వివరంగా తెలుసుకోడానికి అవకాశం లేదు. మద్రాసు మహాజనసభ, భారత జాతీయకాంగ్రెసు స్థాపన వంటి ముఖ్య సంఘటనలు జరిగినపుడు ఆయన ఎంత సంతోషంగా స్వాగతం పలికి ఉంటాడో ఊహించుకోవాల్సిందే. నరసయ్య మద్రాసు మహాజనసభ అభిప్రాయాలను అభిమానించాడు. ఆ సంస్థ కార్యక్రమాలను ఆమోదించాడు. హిందూ పత్రికాధిపతులతో ఆయనకు ఆత్మీయమైన స్నేహమే తప్ప స్పర్ధలేదు.

1896-97 సంవత్సరంలో దేశంలో పెద్ద కాటకం సంభవించింది. ప్రభుత్వం సామాన్య ప్రజలచేత బండరాళ్ళు కొట్టి కంకర చేయడం వంటి అతికఠినమైన కరవు పనులు చేయించి ఉపాధి కల్పించింది. ఈ శ్రమకు ప్రతిఫలం చాలా స్వల్పంగా ఉండేది. ఒక్క మధ్య పరగణాలలోనే లక్షాయాభైవేల ఆకలి చావులు సంభవించాయని హిందూ పత్రిక అంచనా వేసింది. హిందూదేశంలో ప్రభుత్వవ్యయం విషయంలో విచారణ జరపడంకోసం ఇంగ్లాండులో “రాయల్ కమిషన్ ఆన్ ఇండియన్ ఎక్స్పెండిచర్" (Royal Commission on Indian Expenditure) పేర ఒక విచారణాసంఘం ఏర్పాటయింది. లార్డ్ వెల్‌బీ (Lord Welby) కమిషన్ అధ్యక్షుడు. దాదాబాయి నౌరోజీ కమిషన్ సభ్యుడు. మద్రాసు మహాజనసభ సుబ్రహ్మణ్యఅయ్యరును తన ప్రతినిధిగా కమిషన్ ముందు సాక్ష్యం చెప్పడానికి పంపుతున్నట్లు తీర్మానించింది. లండన్ వచ్చే ముందు హిందూ దేశంలో ప్రభుత్వ కర్చులను గురించి సమగ్రంగా వివరాలు సేకరించుకొని, సన్నద్ధుడై రావాలని నౌరోజీ సుబ్రహ్మణ్యఅయ్యరుకు సూచించాడు. సుబ్రహ్మణ్యఅయ్యరు లండన్‌కు బయలుదేరే ముందు కమిషన్ ఎదుట తాను ఏయే విషయాలు ప్రస్తావించ దలచినది క్లుప్తంగా రాసిపంపాడు. 1897 ఏప్రిల్ 10వ తేది ఆయన బొంబాయి నుంచి ఓడలో బయల్దేరివెళ్ళి మే నెలలో కమిషన్ ముందు రెండు సార్లు సాక్ష్యం ఇచ్చాడు.

సుబ్రహ్మణ్యఅయ్యరు లండన్‌కు బయలుదేరే సందర్భంలో ఆయనను అభినందిస్తూ నరసయ్య పీపుల్స్ ఫ్రెండ్‌లో రాసినవ్యాసం నుంచి కొన్ని వాక్యాలు “ఎ హండ్రడ్ ఇయర్స్ ఆఫ్ ది హిందూ” సంపుటంలో ప్రచురించబడ్డాయి.64

The People's Friend of Madras welcomed Subramania Aiyer's trip to England. "It affords us no little pleasure to learn", it wrote, "that our brother, Mr. G. Subramania Aiyer, of The Hindu has been selected by