పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

98

దంపూరు నరసయ్య

అని మొదలై
For editors do not like to print
An article lazily long, and the general reader do not care
For a couple of yards of song,
So gather your wits in the smallest place.
If you win the author's crown,
And every time you write, my friend - boil it down! చరణాలతో ఈ కవిత ముగుస్తుంది.

స్క్రాప్స్ శీర్షికలోనే నేపాల్ మహారాజు మరణించిన అయిదు నెలల తర్వాత, ప్రధానమంత్రి బలవంతంవల్ల విధవలైన రాణులు సతి ఆచరించినట్లు ఒక విషాదవార్త కనిపిస్తుంది. ఇదే శీర్షికలో ఫ్రెంచి భాషలో వెలువడే "The Journal des Mendicants" అనే వింత పత్రికను గురించిన వివరాలున్నాయి. డాక్టరు కె.ఎస్. బహదూర్జి లండన్‌లో వైద్యవిద్య అభ్యసించి, బొంబాయికి తిరిగివస్తున్న వార్త 'ది వీక్' శీర్షికలో ఇవ్వబడింది. ఈయన పశ్చిమ భారతదేశం నుంచి ఎం.డి. పట్టా సాధించిన తొలి వ్యక్తి అనే ప్రశంస కూడా ఉంది. ఈ సంచికలోనే రాయ్‌బరేలీలో ఆర్యసమాజం కులమతాలకు అతీతంగా నిర్వహిస్తున్న అనాథ శరణాలయానికి సంబంధించిన వార్త ఉంది. పత్రికంతా ఇటువంటి వార్తలతోనే నిండి ఉందని చెప్పడంలేదుగాని, సాధారణ పాఠకులు ఇష్టపడే “ఒకే కాన్సులో ముగ్గురు శిశువుల జననం, నగరానికి సర్కస్ ఆగమనం” వంటి సాదావార్తలు కూడా ఈ సంచికలో ఉన్నాయి.

ఛారిటీ స్కూలు

ఈ వార్తల మధ్య నరసయ్య మద్రాసులో నడిపిన “ఛారిటీ స్కూలు” (Charity school) ప్రస్తావన వస్తుంది. మద్రాసు షరీఫ్ (Shariff) సివాలై రామసామి మొదలియారు ఈ స్కూలుకు విరాళం ఇచ్చిన వివరం ఈ విధంగా ఉంది. "...... A cheque for one hundred rupees was forwarded to us on the other day by Sir Sivali Ramasami Mudaliar for the support of our paper and charity school....." ఈ రామసామి మొదలియారు మోనేగారి సత్రానికి 16000 రూపాయల విరాళం, "Going to school" అనే స్వచ్చంద సేవా కార్యక్రమానికి 30000 రూపాయల విరాళం ఇవ్వడం, రాజా జి.ఎన్.గజపతిరావు మోనేగారి సత్రానికి 1000 రూపాయల విరాళం ఇవ్వడానికి సంబంధించిన వార్తలు ఈ సంచికలోనే ప్రచురించబడ్డాయి.

ఈ సంచికలో మద్రాసు ప్రభుత్వం - పత్రికలు, మద్రాసు చట్టసభ, కోయంబత్తూరు జిల్లా అనే మూడు సంపాదకీయ వ్యాసాలు ఉన్నాయి. వీటితోపాటు “మద్రాసు