పుట:Ecchini-Kumari1919.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్ర క ర ణ ము 18

97


ధుమంతమునకుఁ బోయి చూచి మీ రచ్చటి కేల రాలేదో యని విచారించుచు నిచ్చటికి వచ్చితిని,

భీ: _మధుమంతుఁ డేల రాలేదు ?

అ: రాకపోవుట యాశ్చర్యమే !

భీ: ఇచ్ఛిని యట క్షేమముగా నున్నదా !

అ: _అవును, మే మిచ్చటికి వచ్చునపు డామెను జూచి యేవచ్చితిమి. ఇక మీరు తడయ రాదు. ఇచ్ఛినిని గొనివచ్చిన మఱునాటి నుండియుఁ బరమారుని భటులు దేశ మును గాలించుచున్నారు. ఇచ్చిన సమాచారముఁ గనుఁ గొన్న చో వా రవలీలనే వచ్చి 'యాదుర్గమును ముట్టడిం తురు, రాజపుత్రులలోఁ బెక్కం ఢతనికి సాయము చేయ నున్నారు. మనము త్వరగాఁ బోయి యాదుర్గమును రక్షిం పక పోయిన నిచ్ఛినీకుమారి మనకుఁ దక్కుట కష్టము. "లెండు, వేగముగా సైన్యములను వెడలింపుఁడు.

ఈ వచనములు విని భీమ దేవుఁడు తనమీత్రునిఁ గౌఁగి లించుకోని యతని బుద్ధి చాతుర్యమును మెచ్చుకొని యిచ్ఛినీ కుమారిని జూడవలెనన్న కుతూహలమునకు నమరసింహుని ప్రోత్సాహము తోడ్పడ నా దినమున నే చతురంగములతో మధుమంత మను దుర్గమునకుఁ బోయెను,