పుట:Ecchini-Kumari1919.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్ర క ర ణ ము 17

93


యన్యాయముగాఁ బ్రవరించెను. తనతప్పు స్పష్టముగా దెలియ వచ్చుచుండ దానిని దిద్దుకొనకుండుట మీతండ్రికిఁ దగనిపని. అతనిని మంచి మార్గమునకుఁ దేవ లెనని నాతలంపు. మనుష్యులు పలుకష్టము లనుభవించినఁ గాని మంచి మార్గ మును దొక్కరు. అందులకే నేను మీతండ్రిని బర దేశ ములకుఁ బంపించి యంత లేసి కష్టములు గలిగించితిని. ఏమై నను మహాభినివేశముగల యతఁడు యావజ్జీవమును దనపట్టు వదలఁడయ్యెను. అందు చేత నే మీరు పలుకష్టములు పడ వలసిన చ్చెను. ఇక గతమును ద్రవ్వ నేల? నాకు మీయందు ద్వేషబుద్ధి యెప్పుడును లేదు. మిమ్ములను చేరదీసి కొనన లె ననియే నాతలంపు. తండ్రియనంతరమున మనప్రతాప సింహాదులయినను నాతో నేకీభవింప నిష్టపడక నా పై బగ సాధింప బద్ధకంకు లై నా బహిః ప్రాణ మగు నేనుఁగును జంపి వైవకుండిన నేను మీజోలికి రాక పోయియుందును. మీరు పృథ్వీ రాజు నాశ్రయించి జీవించుచున్నారని విని మిగులఁ బరితపించుచున్నాను. ప్రసిద్ధమగు చాళుక్యవంశమునఁ బుట్టి యఖండ రాజ్యాధిపతినగు నాయట్టి వానికి సోదరు లై యుండి మీరు జీవనార్థము పరులను - శత్రురాజును -మన వంశమున కెల్లఁ బరమశత్రువగు చోహన వంశజుని నాశ్ర యుండుట మిక్కిలి శోచనీయము. ఆవిషయము తలంప నాచిత్త ,మెల్లప్పుడును విశేషమగు పరితాపమును జెందుచున్నది. సోదరా! వేజాలోచన విడిచిచి