పుట:Ecchini-Kumari1919.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

86

ఇచ్చినీ కు మారి


మన మధు నచ్చట విశేషముగా లభించుట చే దానికి మధుమంత మని పేరు వచ్చెను.

ఒక నాఁటి తెల్ల వాజు జామున నొక పురుషుఁ డాదుర్గము నుండిబయలు దేఱి యచ్చటికిఁ బోవుచుండెను. వాని భార్య కొంతదూరము దాఁక వానిని వెంబడించి పోయెను. అది భర్తతో 'మన యదృష్ట మిప్పుడు తెల్లముగావలెను. ప్రభు వున కభీష్ట కార్యమును నెఱ వేర్చుటలో మిక్కిలి తోడ్పడి తిమి. మనకుఁ దగిన బహుమానము లభింపక తీఱదు. గురువుగా రీయుత్తరమునఁ గూడ వ్రాసినారఁట ! మిగులఁ గష్టపడిన మనకు బహుమాన మిప్పింపఁ దలంచియే నిన్ను బ్రభువు చెంతకుఁ బంపుచున్నాఁడఁట, గురువుగా రీమాట నాతో స్పష్టముగాఁ జెప్పినారు. నీవు భద్రముగాఁ బోయి బహుమాన మందుకొని రమ్ము' అని చెప్పి యతనిఁ బంపి యాయువతి యింటికీ మఱలెను.

వాఁ డుత్సాహభరితుఁడై యుండుట చేతను, నేదే ఫలాపేక్ష గలవాఁ డగుట చేతను,మార్గము శిలామయ మైనను, విషమ మైయున్నను సరకుగొన లేదు. భార్యను విడిచి వాఁడు పదిబార లదూర మేగకము న్నే మఱియొక బాటసారి వానిని గలసికొని యిట్లు సంభాషించెను.

రెండ: .ఓయీ ! నీ వెక్కడికిఁ బోవుచున్నావు ?

మొద: నేనా ! చాలదూరము పోవలయును.

రెండ: _అదే ! ఏ యూరునకుఁ బోవుదువు ?