పుట:Ecchini-Kumari1919.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్ర క ర ణ ము 4

17

17


రూ-:.. వ్రా సెదను.

ఇచ్ఛినీకుమారి యొక చెలికత్తె చేఁ దన పడకటింటిలో నున్న పృథ్వీరాజు పటమును దెచ్చి రూపవతి కిచ్చెను. ఆయువతి దాని నిదానించి చూచి చిత్రపటము వ్రాయ మొదలిడెను. అది తనచాతుర్యమంతయు - నాచిత్రమునఁ జూ పెను. ఆపటమును జూచి యిచ్ఛినీకుమారి మిగుల సంత. సించి దానికిఁ దగిన బహుమాన మిచ్చి “ఓయువతీ ! నీ నేర్పు మిగులఁ గొనియాడఁ దగియున్నది. నీవలన నీచిత్ర లేఖన విద్య నేర్చుకొనవలె నని యున్నాను. నీవు నేర్పుదువా ? ' అని యడిగెను.

రూ—అమ్మా ! అందుల కభ్యంతర మేమి ? అంత కంటె నాకుఁ గావలసిన దేమున్నది?

ఇచ్చి: – సంతోష మే ! ఇందులకు మాజనకుని యను మతి వడయవలెను. మఱి యొకమారు నాకగపడుము.' అని చెప్పి దానిని బంపి వేసెను,

నాల్గవ ప్రకరణము

దేశ చరిత్రము

హిందూ దేశమునఁ బడమటి సముద్రతీరము నందు ఘూర్జర మను దేశము గలదు. దానినే యిప్పుడు గుజ రాతని పిల్చుచున్నాము. క్రీ. శ. 6 వ శతాబ్ద ప్రారంభమున వల్లభీ పురమును రాజధానిగాఁ జేసికొని శిలాదిత్యుం డను రా