పుట:Ecchini-Kumari1919.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రక ర ణ ము 30

175


నాతఁడే వారిని జంపియుండునని నిశ్చయించి మిగులఁ గుపితు డై తన పినతండ్రిని బిలువ నొక - భటుని: బంపెను, కరుణ రాజును వెంట నే పృథ్వీరాజు భవనమున కరిగెను. రాత్రి యందు నర్తిల్లిన యాఘోరమును విని యాశ్చర్యముతో నాబూ సైనికులు ఢిల్లీ సై నికులును గూడ వచ్చియుండిరి. జై త పరమారుఁడుగూడ, నావింతఁ జూడ ప చ్చెను. పృద్వీరాజు కరుణ రాజుతో 'బాబాయీ ! మీరు చేయు చర్యలన్నియు మిగుల విపరీతములును, మన కప్రతిష్టాకరములును, నామన స్సునకు రోత పుట్టించునవియు వై యున్నవి. ఈ చాళుక్యులను జంపిన వారెవ్వరై యుందురు . ఇది వఱకు వారిలో నిర్వురను జంపినందుల కే మిగుల విచారించుచుండ నిప్పుడు వీరిని జంపి నామసస్సునకు మఱంతసం తాపమునుగూర్చినవా రెవ్వరు ? మీరు తప్ప వీరిని దెగటార్పసాహసించువారు మన సైన్యమున లేరు. మఱియు, నిన్న రాత్రి నన్ను మోసపుచ్చి మీపట భవనమునకుఁ దీసికొనిపోయి యిచ్ఛినీకుమారిని గొనివచ్చెద నని చెప్పి వెడలిపోయితిరి. మఱి నా కగపడ లేదు, ఇచ్చినిజాడ యే లేదు. 'నేను మీనిమిత్త ము వేచియుండి యచ్చట నే నిద్రించితిని. ఈ చాళుక్యులను జంపుట కే నన్నిచ్చటికిఁ బంపి వేసితిరాయేమి ? మీరు నాకుఁ బూజ్యులై నను నిట్టి ఘోర కృత్యములు చేయునప్పుడు సామాన్యముగా విడుచువాఁడను గాను, ఇందులకుఁ దగినసమాధానము చెప్పుఁడు. ఈచాళు క్యులజోలికి ,బోవలదని యిదివఱక నేక పర్యాయములు మీకు బోధించినను నావచనములు తృణప్రాయముగాఁజూచి నన్ను. లక్ష్యపెట్టకున్నారు.మీ రింత నిరంకుశముగా వర్తించుచుందు రేని నే నందులకు సమ్మతింపను. చెప్పుఁడు, నే నడిగిన దానికి